సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగులు నిషేదాన్ని ఉల్లంఘించిన భారీ జరిమానాలు
- July 12, 2022
న్యూ ఢిల్లీ: సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగులు అమ్మేవారికి, వాడేవారికి జరిమానాలు విధించడం మొదలుపెట్టింది ఢిల్లీ గవర్నమెంట్. దేశ రాజధానిలో జులై 1నుంచి నిషేదం అమలవుతుండగా.. ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీ(డీపీసీసీ), అర్బన్ లోకల్ బాడీస్ సంయుక్తంగా సోమవారం ఒక్క రోజులో 119 మందికి జరిమానాలు విధించారు. ఆ ఫైన్ ల మొత్తం రూ.1.23కోట్ల వరకూ ఉందని అధికారులు చెప్తున్నారు.
ఫ్యాక్టరీల్లో, మార్కెట్ యూనిట్లలో నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధిస్తున్నామని వెల్లడించారు. నిషేదం అమలైన రోజే మొదటి పది రోజుల పాటు హెచ్చరికలు జారీ చేసిన ప్రభుత్వం.. సోమవారం నుంచి పెనాల్టీలు మొదలుపెట్టింది. మరికొన్ని రోజుల్లో ఇన్స్పెక్షన్లు కూడా నిర్వహిస్తామని డీపీసీసీ చెప్పింది.
96 యూనిట్లలో డీపీసీసీ టీమ్స్ ఇన్స్పెక్షన్ జరిపాయని వాటిలో 59యూనిట్లకు జరిమానాలు విధించి మూసేశామని చెప్పారు. ఆ జరిమానాల మొత్తం రూ.1.23కోట్ల వరకూ ఉంటుందని అంచనా. ఈ యూనిట్లకు ఎలక్ట్రిక్ సప్లైని ఆపేయాలని సూచనలు అందాయని టీపీడీడీఎల్ డిస్కం వెల్లడించింది.
ప్రస్తుతం షాపులు, కమర్షియల్ యూనిట్ల మీదనే ఫోకస్ పెట్టామని వ్యక్తుల మీద కాదని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







