సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగులు నిషేదాన్ని ఉల్లంఘించిన భారీ జరిమానాలు
- July 12, 2022
న్యూ ఢిల్లీ: సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగులు అమ్మేవారికి, వాడేవారికి జరిమానాలు విధించడం మొదలుపెట్టింది ఢిల్లీ గవర్నమెంట్. దేశ రాజధానిలో జులై 1నుంచి నిషేదం అమలవుతుండగా.. ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీ(డీపీసీసీ), అర్బన్ లోకల్ బాడీస్ సంయుక్తంగా సోమవారం ఒక్క రోజులో 119 మందికి జరిమానాలు విధించారు. ఆ ఫైన్ ల మొత్తం రూ.1.23కోట్ల వరకూ ఉందని అధికారులు చెప్తున్నారు.
ఫ్యాక్టరీల్లో, మార్కెట్ యూనిట్లలో నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధిస్తున్నామని వెల్లడించారు. నిషేదం అమలైన రోజే మొదటి పది రోజుల పాటు హెచ్చరికలు జారీ చేసిన ప్రభుత్వం.. సోమవారం నుంచి పెనాల్టీలు మొదలుపెట్టింది. మరికొన్ని రోజుల్లో ఇన్స్పెక్షన్లు కూడా నిర్వహిస్తామని డీపీసీసీ చెప్పింది.
96 యూనిట్లలో డీపీసీసీ టీమ్స్ ఇన్స్పెక్షన్ జరిపాయని వాటిలో 59యూనిట్లకు జరిమానాలు విధించి మూసేశామని చెప్పారు. ఆ జరిమానాల మొత్తం రూ.1.23కోట్ల వరకూ ఉంటుందని అంచనా. ఈ యూనిట్లకు ఎలక్ట్రిక్ సప్లైని ఆపేయాలని సూచనలు అందాయని టీపీడీడీఎల్ డిస్కం వెల్లడించింది.
ప్రస్తుతం షాపులు, కమర్షియల్ యూనిట్ల మీదనే ఫోకస్ పెట్టామని వ్యక్తుల మీద కాదని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ప్రముఖ ఒడిస్సీ నృత్యకారిణి మధుమిత రౌత్ కన్నుమూత
- SATA జెద్దా–ఉగాది & ఈద్ వేడుకలు ఘనంగా నిర్వహణ
- శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర సీఎం చంద్రబాబు
- హైదరాబాద్ పన్ను చెల్లింపుదారులకు శుభవార్త
- టీమిండియా ఐర్లాండ్ పర్యటన ఖరారు..షెడ్యూల్ ఇదే!
- భారత దేశవ్యాప్తంగా ఘనంగా రంజాన్ వేడుకలు..
- యుద్ధం ముగిసేందుకు అమెరికా మిత్రదేశాలు సహాయపడాలి: సయ్యద్ బదర్
- అమెరికాకు శ్రీలంక బిగ్ షాక్
- ఇరాన్ దాడుల పై జీసీసీ మానవ హక్కుల సంస్థల అత్యవసర సమావేశం..!!
- హోర్ముజ్ జలసంధి పై పలు దేశాల సంయుక్త ప్రకటన..!









