భారత్కు బంగారు పతకాన్ని సాధించి పెట్టిన 94ఏళ్ల బామ్మ..
- July 12, 2022
ఫిన్లాండ్: 94 ఏళ్ల భగవని దేవి దాగర్ 100 మీటర్లను 24.74 సెకన్లలో పూర్తి చేసి బంగారు పతకాన్ని గెలుచుకుంది. లేటు వయసులో ఈ రికార్డు సాధించడంతో ప్రపంచం దేశాలు ఆమెను ప్రశంసిస్తున్నాయి. ఫిన్లాండ్లోని టాంపెర్లో 100 మీటర్ల ప్రపంచ అథ్లెటిక్ చాంపియన్షిప్ పోటీలు జరిగాయి. 35 ఏళ్లు పైబడి ఉన్న అథ్లెట్లు ఈ పోటీలో పాల్గొన్నారు. భగవని దేవికి 94ఏళ్లు ఉన్నా.. అందరినీ వెనక్కనెట్టి ఈ విజయాన్ని సాధించింది.భగవని దేవి దాగర్ హర్యానాలోని ఖిడ్కా గ్రామానికి చెందిన వారు. 100 మీటర్ల స్ప్రింట్తో పాటు షాట్పుట్లో కూడా ఆమె బ్రాన్జ్ పతకాన్ని సాధించింది. కేంద్ర మంత్రి పియుష్ గోయల్ భగవని దేవి దాగర్ విజయ అందరికీ స్పూర్తి అని ట్వీట్ చేశారు. భారత్కు 2 పతకాలు సాధించిపెట్టడం గర్వంగా ఉందని, ప్రపంచం ఆమె పాదాల చెంత ఉందని.. 94 ఏళ్ల వయసులో అద్భుతమైన విజయం అని సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- లెజెండరీ యాక్షన్ స్టార్ చక్ నోరిస్ కన్నుమూత!
- వాట్సాప్లో అదిరిపోయే అప్డేట్
- శంకర నేత్రాలయ USA న్యూజెర్సీ వారి సంగీతం మరియు నృత్య కార్యక్రమం
- 109 మందిని అరెస్టు చేసిన అబుదాబి పోలీసులు..!!
- తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
- అక్రమ బెట్టింగ్..300 యాప్ల పై కేంద్రం ఉక్కుపాదం!
- అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్ IRGC ఆఫీసర్ హతం
- యూఏఈలో ఐక్యతను చాటిచెప్పిన ఈద్ ప్రార్థనలు..!!
- రిఫైనరీలు లక్ష్యంగా డ్రోన్ అటాక్స్..KPC క్లారిటీ..!!
- $20 బిలియన్ల నష్టం..17% దెబ్బతిన్న LNG ఎగుమతి సామర్థ్యం..!!









