మాల్దీవ్స్ పారిపోయిన శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స
- July 13, 2022
కొలంబో: శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స కుటుంబంతో కలిసి మాల్దీవ్స్ పారిపోయినట్లు ఒక నివేదిక తెలిపింది. నిజానికి బుధవారం గొటబయ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాల్సి ఉంది. రాజీనామా చేయడానికి ముందే ఆయన మాల్దీవ్స్ వెళ్లిపోయారు. గొటబయతోపాటు ఆయన భార్య, బాడీగార్డ్, మరొకరు లేదా ఇద్దరు సిబ్బంది మాల్దీవ్స్ వెళ్లిపోయారు.
ఆంటోనోవ్32 అనే మిలిటరీ విమానంలో శ్రీలంకలోని కొలంబో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నుంచి ఆయన పారిపోయారు. కొలంబో ఎయిర్పోర్టులో గొటబయను ఇమ్మిగ్రేషన్ సిబ్బంది దాదాపు 24 గంటలపాటు ఉంచినట్లు సమాచారం. ఆ తర్వాతే ఆయన విమానానికి అనుమతించారు. నిజానికి ఆయన కమర్షియల్ ఫ్లైట్లో దుబాయ్ వెళ్దామనుకున్నారు. కానీ, ఎయిర్పోర్టు సిబ్బంది వీఐపీ సర్వీసుల్ని రద్దు చేశారు. దీంతో ఆయన సాధారణ ప్రజలతోపాటు పబ్లిక్ కౌంటర్స్ ద్వారా విమానంలో ప్రయాణించాల్సి ఉంది. ప్రజల మధ్యలోంచి వెళ్తే ప్రజలు తిరగబడే అవకాశం ఉంది.
ఇది ప్రమాదకరమని భావించిన ఆయన ఎయిర్పోర్టు సిబ్బందిని ఒప్పించేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ వీఐపీ సర్వీసులకు ఒప్పుకోలేదు. ఈ క్రమంలో యూఏఈకి చెందిన నాలుగు విమానాలు వెళ్లిపోయాయి. విమాన ప్రయాణం కుదరని పక్షంలో సముద్ర మార్గంలో కూడా వెళ్లాలని ఆయన ఆలోచించారు. చివరకు మిలిటరీ విమానంలో మాల్దీవ్స్ వెళ్లిపోయారు. అక్కడ భద్రత మధ్య ఒక రహస్య స్థావరానికి ఆయన వెళ్లిపోయారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







