మాల్దీవ్స్ పారిపోయిన శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స
- July 13, 2022
కొలంబో: శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స కుటుంబంతో కలిసి మాల్దీవ్స్ పారిపోయినట్లు ఒక నివేదిక తెలిపింది. నిజానికి బుధవారం గొటబయ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాల్సి ఉంది. రాజీనామా చేయడానికి ముందే ఆయన మాల్దీవ్స్ వెళ్లిపోయారు. గొటబయతోపాటు ఆయన భార్య, బాడీగార్డ్, మరొకరు లేదా ఇద్దరు సిబ్బంది మాల్దీవ్స్ వెళ్లిపోయారు.
ఆంటోనోవ్32 అనే మిలిటరీ విమానంలో శ్రీలంకలోని కొలంబో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నుంచి ఆయన పారిపోయారు. కొలంబో ఎయిర్పోర్టులో గొటబయను ఇమ్మిగ్రేషన్ సిబ్బంది దాదాపు 24 గంటలపాటు ఉంచినట్లు సమాచారం. ఆ తర్వాతే ఆయన విమానానికి అనుమతించారు. నిజానికి ఆయన కమర్షియల్ ఫ్లైట్లో దుబాయ్ వెళ్దామనుకున్నారు. కానీ, ఎయిర్పోర్టు సిబ్బంది వీఐపీ సర్వీసుల్ని రద్దు చేశారు. దీంతో ఆయన సాధారణ ప్రజలతోపాటు పబ్లిక్ కౌంటర్స్ ద్వారా విమానంలో ప్రయాణించాల్సి ఉంది. ప్రజల మధ్యలోంచి వెళ్తే ప్రజలు తిరగబడే అవకాశం ఉంది.
ఇది ప్రమాదకరమని భావించిన ఆయన ఎయిర్పోర్టు సిబ్బందిని ఒప్పించేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ వీఐపీ సర్వీసులకు ఒప్పుకోలేదు. ఈ క్రమంలో యూఏఈకి చెందిన నాలుగు విమానాలు వెళ్లిపోయాయి. విమాన ప్రయాణం కుదరని పక్షంలో సముద్ర మార్గంలో కూడా వెళ్లాలని ఆయన ఆలోచించారు. చివరకు మిలిటరీ విమానంలో మాల్దీవ్స్ వెళ్లిపోయారు. అక్కడ భద్రత మధ్య ఒక రహస్య స్థావరానికి ఆయన వెళ్లిపోయారు.
తాజా వార్తలు
- ఖతార్ లో నిరాటంకంగా ఆసుపత్రులు, ఆరోగ్య సేవలు..!!
- భార్య మృతికి కారణమైన భర్తకు జైలుశిక్ష ఖరారు..!!
- గ్రాండ్ మసీదులో ఈద్ ప్రార్థనలు రద్దు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన సుల్తాన్, భారత ప్రధాని మోదీ..!!
- ఇరాన్ దాడులకు వ్యతిరేకంగా ఏకమైన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- ఈద్ అల్ ఫితర్..ఉచిత, డిస్కౌంట్ ఆఫర్స్ కు ఫిదా..!!
- హైదరాబాద్ విమానాశ్రయానికి అవార్డు
- ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
- చైనాలో భారత రాయబారిగా విక్రమ్ దొరైస్వామి
- ఏపీలో 10,060 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల..









