మాల్దీవ్స్ పారిపోయిన శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స
- July 13, 2022
కొలంబో: శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స కుటుంబంతో కలిసి మాల్దీవ్స్ పారిపోయినట్లు ఒక నివేదిక తెలిపింది. నిజానికి బుధవారం గొటబయ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాల్సి ఉంది. రాజీనామా చేయడానికి ముందే ఆయన మాల్దీవ్స్ వెళ్లిపోయారు. గొటబయతోపాటు ఆయన భార్య, బాడీగార్డ్, మరొకరు లేదా ఇద్దరు సిబ్బంది మాల్దీవ్స్ వెళ్లిపోయారు.
ఆంటోనోవ్32 అనే మిలిటరీ విమానంలో శ్రీలంకలోని కొలంబో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నుంచి ఆయన పారిపోయారు. కొలంబో ఎయిర్పోర్టులో గొటబయను ఇమ్మిగ్రేషన్ సిబ్బంది దాదాపు 24 గంటలపాటు ఉంచినట్లు సమాచారం. ఆ తర్వాతే ఆయన విమానానికి అనుమతించారు. నిజానికి ఆయన కమర్షియల్ ఫ్లైట్లో దుబాయ్ వెళ్దామనుకున్నారు. కానీ, ఎయిర్పోర్టు సిబ్బంది వీఐపీ సర్వీసుల్ని రద్దు చేశారు. దీంతో ఆయన సాధారణ ప్రజలతోపాటు పబ్లిక్ కౌంటర్స్ ద్వారా విమానంలో ప్రయాణించాల్సి ఉంది. ప్రజల మధ్యలోంచి వెళ్తే ప్రజలు తిరగబడే అవకాశం ఉంది.
ఇది ప్రమాదకరమని భావించిన ఆయన ఎయిర్పోర్టు సిబ్బందిని ఒప్పించేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ వీఐపీ సర్వీసులకు ఒప్పుకోలేదు. ఈ క్రమంలో యూఏఈకి చెందిన నాలుగు విమానాలు వెళ్లిపోయాయి. విమాన ప్రయాణం కుదరని పక్షంలో సముద్ర మార్గంలో కూడా వెళ్లాలని ఆయన ఆలోచించారు. చివరకు మిలిటరీ విమానంలో మాల్దీవ్స్ వెళ్లిపోయారు. అక్కడ భద్రత మధ్య ఒక రహస్య స్థావరానికి ఆయన వెళ్లిపోయారు.
తాజా వార్తలు
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..
- 'బెల్ ఆఫ్ ఆర్మ్స్', 'సారథి' సెంట్రల్ వర్క్షాప్ను ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- మా కృషి వల్లే జిందాల్ స్టీల్ నిర్మాణం: జగన్
- షార్జా ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల కాన్సులర్ అటెస్టేషన్ సేవలు
- గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన పవన్ కల్యాణ్
- దేశంలోనే తొలిసారి.. విమానాన్ని వేలం వేసిన ED..
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!







