సోషల్ మీడియా అలవాటు నుండి బయటకు రావటం ఎలా?
- July 16, 2022
నమస్కారం,
నేను ఇంజనీరింగ్ మూడవ సంవత్సరం చదువుతున్నా.నేను మామూలుగా చాలా మంచి స్టుడెంట్ ని .ఈ మధ్య సరిగ్గా చదవలేకపోతున్నా. ఎక్కువసేపు చదువు మీద ద్రుష్టి పెట్టలేకపోతున్నా.ట్విట్టర్, వాట్సాప్,ఇంస్టాగ్రామ్ చూస్తూ కూర్చుంటున్నా.ఈ అలవాటు మాని మళ్ళీ నేను ఇదివరకటి లాగా చదవగలనా అనిపిస్తోంది. ఏమైనా సలహా ఇవ్వగలరు.
- విజయవాడ నుండి
జవాబు: నమస్కారం , మీరు ఇంజనీరింగ్ మూడవ సంవత్సరం చదువుతున్నా అంటున్నారు కదా. మీరు చెప్పిన ఈ సోషల్ మీడియా అలవాటు మీకు ఒక్కరికే కాదు,ఇప్పుడు ఉన్న జెనరేషన్ పిల్లలు అందరూ ఎదుర్కుంటున్న సమస్య.
ముఖ్యంగా కరోనా వల్ల రెండు సంవత్సరాలు ఆన్లైన్ క్లాస్సేస్ వల్ల ఈ సమస్య ఇంకా ఎక్కువ అయ్యింది. మీకు దీని నుండి ఎలాగైనా బయటకి రావాలి అన్న ఆలోచన రావటం హర్షించదగిన విషయం.
ఈ అలవాటు నుండి బయటకు రావటం చాలా కష్టం,మీకు పట్టుదల ఉంటె ఈజీ గా వదిలించుకోవచ్చు.
1. వాట్సాప్ లో అవసరం లేని గ్రూప్స్ నుండి బయటకు వచ్ఛేయ్యండి. మీకు చదువుకి
సంబంధించిన గ్రూప్స్ లో మాత్రమే ఉండండి. ఎక్కువ అవసరం లేకపోతే ఇంస్టాగ్రామ్
అకౌంట్ కొన్ని రోజులకి డిలీట్ చెయ్యండి.
2. అసైన్మెంట్స్ లేదా నోట్స్ లాంటివి సాధ్యమైనంత వరకు కాలేజీ లోనే నోట్ చేసుకోండి.
ఒక వేళా ఒక రోజు మానేస్తే మర్నాడు మళ్ళీ క్లాస్ లోనే అడగటం లాంటివి అలవాటు
చేసుకోండి.
3. ఇంటికి వచ్చాక మాత్రం సాధ్యమైనంత వరకు మీ మొబైల్ లేదా కంప్యూటర్ వాడద్దు .
4. రిఫరెన్స్ కోసం గూగుల్ కాకుండా కాలేజీ లైబ్రరీ లో పుస్తకాలు చదవండి.
5. ఇంకా మీరు ఎక్కువ సమయం వాకింగ్ లేక మీకు నచ్చిన ఏ ఇతర హాబీస్ మీద వెచ్చించండి.
ఇవి కొన్ని రోజులు పాటించి నాకు వ్రాయండి . ఇంకా తగ్గకపోతే మనం వేరే మార్గాలు కూడా ప్రయత్నం చేద్దాం.
--ఉమాదేవి వాడ్రేవు(సైకాలజీ కౌన్సిలర్ )
తాజా వార్తలు
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు
- విదేశీ విద్యార్థులకు US కొత్త రూల్స్..!
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు.. కువైట్పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ఇరాన్ పై అమెరికా వరుసగా 10వ రాత్రి దాడులు..
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు







