జెడ్డాలో జో బిడెన్ని కలిసిన అమీర్
- July 17, 2022
దోహా: అమెరికా అధ్యక్షుడు హెచ్ఈ జో బిడెన్ను అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ జెడ్డాలో కలిశారు. భద్రత, అభివృద్ధి కోసం జెడ్డా సదస్సు సందర్భంగా వీరిద్దరు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో వారు రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలపై వారు చర్చించారు. ముఖ్యంగా భద్రత, రక్షణ, క్రీడలలో సంబంధాలపై సమీక్షించారు. ప్రత్యేకించి ఖతార్ FIFA ప్రపంచ కప్ ఖతార్ 2022కి ఆతిథ్యంపై చర్చించారు. ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై కూడా ఇరు దేశాల నేతలు చర్చించారు. భద్రత, స్థిరత్వాన్ని పెంపొందించడంలో ఖతార్ పాత్రను, ఆఫ్ఘనిస్తాన్లో శాంతి ప్రక్రియలో ఖతార్ ప్రయత్నాలకు అమెరికా అధ్యక్షుడు ఈ సందర్భంగ కొనియాడారు.
తాజా వార్తలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ పరిసరాల్లో కీలక రహదారులు తాత్కాలికంగా మూసివేత!
- దుబాయ్ ఎయిర్పోర్ట్లో విమాన సర్వీసులు తాత్కాలికంగా నిలిపివేత!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ సమీపంలో అగ్నిప్రమాదం
- యూఏఈలో పిల్లల భద్రతకు అగ్ర ప్రాధాన్యత..షేక్ మొహమ్మద్
- ఈద్ అల్-ఫితర్ సెలవులను ప్రకటించిన ఖతార్..!!
- ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి రంగం సిద్ధం
- పద్మ అవార్డుల కోసం నామినేషన్ల స్వీకరణ
- కేంద్రం సంచలనం..వాళ్లంతా గ్యాస్ సిలిండర్స్ వెనక్కి ఇచ్చేయాలి..
- నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్, మే 4న కౌంటింగ్
- ఇదీ మీ ప్రభుత్వం...కలిసి ముందుకు సాగుదాం: సీఎం రేవంత్









