మధ్య ప్రదేశ్: ఘోర రోడ్డు ప్రమాదం..12 మంది మృతి..15 మందికి గాయాలు
- July 18, 2022
భోపాల్: మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దాదాపు 40 మందితో ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు ప్రమాదవశాత్తూ నర్మద నదిలో పడిపోయింది. దీంతో 12 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో 15 మందికి గాయాలయ్యాయి. పలువురు గల్లంతయ్యారు. ధార్ జిల్లా ఖాల్ఘాట్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ బస్సు ఇండోర్ నుంచి మహారాష్ట్రలోని పుణె వెళ్తుండగా వంతెనపై అదుపు తప్పి నర్మదా నదిలో పడిపోయిందని అధికారులు చెప్పారు.
పోలీసులు, రెస్క్యూ బృందాల సభ్యులు సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు. ఈ ప్రమాదంలో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టామని అధికారులు చెబుతున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రమాదం పట్ల మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని చెప్పారు. సహాయక చర్యల్లో పాల్గొనాలని, క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించాలని ఆయన అధికారులకు సూచించారు.
తాజా వార్తలు
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..
- 'బెల్ ఆఫ్ ఆర్మ్స్', 'సారథి' సెంట్రల్ వర్క్షాప్ను ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- మా కృషి వల్లే జిందాల్ స్టీల్ నిర్మాణం: జగన్
- షార్జా ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల కాన్సులర్ అటెస్టేషన్ సేవలు
- గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన పవన్ కల్యాణ్
- దేశంలోనే తొలిసారి.. విమానాన్ని వేలం వేసిన ED..
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!







