మధ్య ప్రదేశ్: ఘోర రోడ్డు ప్రమాదం..12 మంది మృతి..15 మందికి గాయాలు
- July 18, 2022
భోపాల్: మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దాదాపు 40 మందితో ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు ప్రమాదవశాత్తూ నర్మద నదిలో పడిపోయింది. దీంతో 12 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో 15 మందికి గాయాలయ్యాయి. పలువురు గల్లంతయ్యారు. ధార్ జిల్లా ఖాల్ఘాట్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ బస్సు ఇండోర్ నుంచి మహారాష్ట్రలోని పుణె వెళ్తుండగా వంతెనపై అదుపు తప్పి నర్మదా నదిలో పడిపోయిందని అధికారులు చెప్పారు.
పోలీసులు, రెస్క్యూ బృందాల సభ్యులు సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు. ఈ ప్రమాదంలో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టామని అధికారులు చెబుతున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రమాదం పట్ల మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని చెప్పారు. సహాయక చర్యల్లో పాల్గొనాలని, క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించాలని ఆయన అధికారులకు సూచించారు.
తాజా వార్తలు
- ప్రపంచ శాంతి, స్థిరత్వానికి మద్దతు సౌదీ కొనసాగిస్తుంది..కింగ్ సల్మాన్
- యూఏఈలో భారీ వర్షాలు, ఉరుములు, వడగళ్ల వాన కురిసే అవకాశం..!!
- ఖతార్ లో ఉరుములతో కూడిన వర్షం, బలమైన గాలులు..!!
- పౌరులకు, నివాసితులకు ఈద్ శుభాకాంక్షలు తెలిపిన సుల్తాన్..!!
- కువైట్-భారత్ అనుసంధానం..జజీరా ఎయిర్వేస్కు ప్రత్యేక అనుమతి..!!
- ఫేక్ కరెన్సీ.. బహ్రెయిన్ వ్యక్తికి 5 ఏళ్ల జైలు శిక్ష..!!
- వైభవంగా ‘గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్’ వేడుక.. చిరంజీవి, నాగార్జున, కమల్ హాసన్ సందడి..
- సోషల్ మీడియా కంటెంట్ బ్లాకింగ్ పై కేంద్రం కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026లో జట్ల హెడ్కోచ్లు వీళ్లే
- ఖతార్ లో నిరాటంకంగా ఆసుపత్రులు, ఆరోగ్య సేవలు..!!









