సోషల్ మీడియాలో దూషణకు Dhs 500,000 జరిమానా

- July 21, 2022 , by Maagulf
సోషల్ మీడియాలో దూషణకు Dhs 500,000 జరిమానా

యూఏఈ: సమాచార నెట్‌వర్క్ ను ఉపయోగించి ఇతరులను తిట్టడం, దూషణలకు జరిమానాలను UAE పబ్లిక్ ప్రాసిక్యూషన్ (PP) స్పష్టం చేసింది. ఎలక్ట్రానిక్ నేరాలు, పుకార్లను ఎదుర్కోవడానికి 2021 ఫెడరల్ డిక్రీ-లా నెం.34లోని ఆర్టికల్ 43 ప్రకారం.. ఇతరులను దూషించడం లేదా ఏదైనా సంఘటనకు ఆపాదించినా, ఇతర వ్యక్తిని బాధించేలా వ్యవహరించినా.. అవమానించేలా చేస్తుందని UAE PP తెలిపింది. అలాంటి ఘటనల్లో సదరు సోషల్ మీడియా సంస్థలకు, వ్యక్తులకు జైలు శిక్ష లేదా జరిమానా కింద Dhs250,000 నుంచి Dhs500,000 వరకు విధిస్తామని హెచ్చరించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com