బహ్రెయిన్ వార్షిక ఫైన్ ఆర్ట్స్ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- February 16, 2026
మనమా: బహ్రెయిన్ నేషనల్ మ్యూజియంలో 52వ ఎడిషన్ బహ్రెయిన్ వార్షిక ఫైన్ ఆర్ట్స్ ఎగ్జిబిషన్ను హిజ్ రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా తరపున, క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా ప్రారంభించారు. బహ్రెయిన్ సృజనాత్మక వారసత్వాన్ని మరియు ప్రాంతీయంగా, అంతర్జాతీయంగా ఇలాంటి ఎగ్జిబిషన్లు తెలియజేస్తాయని పేర్కొన్నారు.
మల్టీమీడియా ఇన్స్టాలేషన్లు, వీడియో ఆర్ట్, ఫోటోగ్రఫీ, ఆర్ట్ మరియు సమకాలీన డ్రాయింగ్తో సహా విభిన్న టాలెంట్ ఉన్న దాదాపు 74 మంది కళాకారుల అద్భుత సృష్టిని ఎగ్జిబిషన్ లో ఏర్పాటు చేశారు. వీటిని సందర్శించిన హిస్ హైనెస్, కళాకారులు చేసిన కృషిని అభినందించారు. సృజనాత్మకత మరియు ఆవిష్కరణలకు కేంద్రంగా బహ్రెయిన్ స్థాయిని పెంచిన బహ్రెయిన్ అథారిటీ ఫర్ కల్చర్ అండ్ యాంటిక్విటీస్ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ అహ్మద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫాను ఈ సందర్భంగా అభినందించారు. చివరగా అత్యుత్తమ కళాకారులకు అవార్డులను ప్రదానం చేశారు.
అల్-దానా అవార్డును అబ్దుల్ జబ్బర్ అల్-గధబాన్, అల్ రివాక్ ఆర్ట్ స్పేస్ “నెక్సస్ ప్రోగ్రామ్” అవార్డును ఖలీద్ వలీద్ అల్-అబ్బాస్, RAK ఆర్ట్ ఫౌండేషన్ అవార్డును హుస్సేన్ అలీ ఇసాకు అందజేశారు. 1972 లో స్థాపించిన బహ్రెయిన్ వార్షిక ఫైన్ ఆర్ట్స్ ఎగ్జిబిషన్ రాజ్యంలో ఒక ప్రధాన సాంస్కృతిక వేదికగా గుర్తింపు పొందింది.
తాజా వార్తలు
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్..
- సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు.. ఘనస్వాగతం పలికిన తెలుగు ప్రజలు
- ఫ్రాన్స్ అధ్యక్షుడి తో ప్రధాని మోడీ సమావేశం
- డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాల పై అవగాహన అవసరం: డా.జి.దీప
- అబుదాబిలో ఘనంగా 12వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!









