ఆకాశ ఎయిర్ మొట్టమొదటి కమర్షియల్ విమాన సేవలు..
- July 22, 2022
న్యూ ఢిల్లీ: ప్రముఖ మదుపరి (ఇన్వెస్టర్) రాకేశ్ ఝున్ఝున్ వాలాకు చెందిన ఆకాశ ఎయిర్ మొట్టమొదటి కమర్షియల్ విమాన సేవలు ఆగస్టు 7 నుంచి ప్రారంభం కానున్నాయి.మొదటి విమానం బోయింగ్ 737 మ్యాక్స్ ప్రయాణికులతో ముంబై నుంచి అహ్మదాబాద్ వెళ్ళనుంది.ముంబై-అహ్మదాబాద్ మధ్య సేవలు అందించే ఆకాశ ఎయిర్కు చెందిన విమానాలకు సంబంధించిన టికెట్ల బుకింగ్లను ప్రారంభించామని ఇవాళ ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.అలాగే, ఆగస్టు 13 నుంచి బెంగళూరు-కొచ్చి మధ్య విమాన సేవలు అందిస్తామని, వీటి బుకింగులు కూడా ప్రారంభమయ్యాయని చెప్పింది.
ఆకాశ ఎయిర్ సంస్థ గత ఏడాది బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల కోసం ఆర్డర్ ఇచ్చిన విషయం తెలిసిందే. కమర్షియల్ సేవలకు గాను ఆ సంస్థ ఇటీవల పెద్ద ఎత్తున సిబ్బందిని నియమించుకుంది.ఇప్పటికే కమర్షియల్ విమానాలు నడిపేందుకు లైసెన్సులను పొందింది. దశల వారీగా సేవలను విస్తరించుకుంటూ పోనుంది.కొన్ని నెలల్లో దేశంలోని మరిన్ని నగరాల మధ్య ఆకాశ ఎయిర్ సేవలు అందనున్నాయని ఆ సంస్థ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









