ఆకాశ ఎయిర్ మొట్టమొదటి కమర్షియల్ విమాన సేవలు..
- July 22, 2022
న్యూ ఢిల్లీ: ప్రముఖ మదుపరి (ఇన్వెస్టర్) రాకేశ్ ఝున్ఝున్ వాలాకు చెందిన ఆకాశ ఎయిర్ మొట్టమొదటి కమర్షియల్ విమాన సేవలు ఆగస్టు 7 నుంచి ప్రారంభం కానున్నాయి.మొదటి విమానం బోయింగ్ 737 మ్యాక్స్ ప్రయాణికులతో ముంబై నుంచి అహ్మదాబాద్ వెళ్ళనుంది.ముంబై-అహ్మదాబాద్ మధ్య సేవలు అందించే ఆకాశ ఎయిర్కు చెందిన విమానాలకు సంబంధించిన టికెట్ల బుకింగ్లను ప్రారంభించామని ఇవాళ ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.అలాగే, ఆగస్టు 13 నుంచి బెంగళూరు-కొచ్చి మధ్య విమాన సేవలు అందిస్తామని, వీటి బుకింగులు కూడా ప్రారంభమయ్యాయని చెప్పింది.
ఆకాశ ఎయిర్ సంస్థ గత ఏడాది బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల కోసం ఆర్డర్ ఇచ్చిన విషయం తెలిసిందే. కమర్షియల్ సేవలకు గాను ఆ సంస్థ ఇటీవల పెద్ద ఎత్తున సిబ్బందిని నియమించుకుంది.ఇప్పటికే కమర్షియల్ విమానాలు నడిపేందుకు లైసెన్సులను పొందింది. దశల వారీగా సేవలను విస్తరించుకుంటూ పోనుంది.కొన్ని నెలల్లో దేశంలోని మరిన్ని నగరాల మధ్య ఆకాశ ఎయిర్ సేవలు అందనున్నాయని ఆ సంస్థ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- రాకేష్ బోద్ధులకు 'వంశీ విశ్వనాథ్ కళా తపస్వి’ జాతీయ పురస్కార ప్రదానం
- ఏపీ మోడల్ స్కూల్స్ ల్లో ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లు జాగ్రత్త..
- యూట్యూబర్ అన్వేష్ కు బిగ్ షాక్
- హైదరాబాద్లో అనిరుధ్ కాన్సర్ట్, టికెట్లకు భారీ పోటీ!
- బ్రహ్మోత్సవాలకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు యాదాద్రి ఈఓ ఆహ్వానం
- కింగ్ ఫహద్ కాజ్వే పై టోల్ బాదుడు షురూ..!!
- ట్రాఫిక్ డిపార్టుమెంట్ కు కొత్త వర్కింగ్ అవర్స్..!!
- విద్యాసంస్థలకు మద్దతుగా మెడికల్ ఇక్విప్ మెంట్..!!
- ప్రపంచ వారసత్వ జాబితాలో ఒమన్ సైట్లకు చోటు..!!









