ఆకాశ ఎయిర్ మొట్టమొదటి కమర్షియల్ విమాన సేవలు..
- July 22, 2022
న్యూ ఢిల్లీ: ప్రముఖ మదుపరి (ఇన్వెస్టర్) రాకేశ్ ఝున్ఝున్ వాలాకు చెందిన ఆకాశ ఎయిర్ మొట్టమొదటి కమర్షియల్ విమాన సేవలు ఆగస్టు 7 నుంచి ప్రారంభం కానున్నాయి.మొదటి విమానం బోయింగ్ 737 మ్యాక్స్ ప్రయాణికులతో ముంబై నుంచి అహ్మదాబాద్ వెళ్ళనుంది.ముంబై-అహ్మదాబాద్ మధ్య సేవలు అందించే ఆకాశ ఎయిర్కు చెందిన విమానాలకు సంబంధించిన టికెట్ల బుకింగ్లను ప్రారంభించామని ఇవాళ ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.అలాగే, ఆగస్టు 13 నుంచి బెంగళూరు-కొచ్చి మధ్య విమాన సేవలు అందిస్తామని, వీటి బుకింగులు కూడా ప్రారంభమయ్యాయని చెప్పింది.
ఆకాశ ఎయిర్ సంస్థ గత ఏడాది బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల కోసం ఆర్డర్ ఇచ్చిన విషయం తెలిసిందే. కమర్షియల్ సేవలకు గాను ఆ సంస్థ ఇటీవల పెద్ద ఎత్తున సిబ్బందిని నియమించుకుంది.ఇప్పటికే కమర్షియల్ విమానాలు నడిపేందుకు లైసెన్సులను పొందింది. దశల వారీగా సేవలను విస్తరించుకుంటూ పోనుంది.కొన్ని నెలల్లో దేశంలోని మరిన్ని నగరాల మధ్య ఆకాశ ఎయిర్ సేవలు అందనున్నాయని ఆ సంస్థ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- 'బెల్ ఆఫ్ ఆర్మ్స్', 'సారథి' సెంట్రల్ వర్క్షాప్ను ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- మా కృషి వల్లే జిందాల్ స్టీల్ నిర్మాణం: జగన్
- షార్జా ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల కాన్సులర్ అటెస్టేషన్ సేవలు
- గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన పవన్ కల్యాణ్
- దేశంలోనే తొలిసారి.. విమానాన్ని వేలం వేసిన ED..
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!
- డమాస్కస్ కేఫ్ బాంబు దాడిని ఖండించిన ఒమన్..!!
- ఖతార్ అంతటా కస్టమర్ సాటిస్పెక్షన్ సర్వే 2026..!!
- జూన్ నెలలో 911 నెంబర్ కు 26 లక్షల కాల్స్..!!







