బంగారం దిగుమతుల విధానాన్ని ప్రకటించిన యూఏఈ
- July 22, 2022
యూఏఈ: బంగారం దిగుమతులకు సంబంధించి కొత్త విధానాన్ని యూఏఈ ప్రకటించింది. గోల్డ్ రిఫైనింగ్, బంగారు ఉత్పత్తుల రీసైక్లింగ్, విలువైన లోహాలు- రత్నాలు వీటిని నియమించబడిన నాన్-ఫైనాన్షియల్ వ్యాపారాలు, వృత్తులుగా వర్గీకరించే రంగంలో పనిచేసే కంపెనీలకు కొత్త నిబంధనలు వర్తిస్తాయని పేర్కొంది. ప్రస్తుతం దేశంలో 28 విలువైన మెటల్ రిఫైనరీలు పనిచేస్తున్నాయి. జనవరి 2023 నుండి అమల్లోకి రానున్న కొత్త విధానం.. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (OECD) ప్రోటోకాల్కు అనుగుణంగా ఉంటుందని తెలిపింది. కొత్త నిబంధనల ప్రకారం.. నిబంధనలను ఉల్లంఘించిన కంపెనీలకు 50,000 నుండి 5 మిలియన్ దిర్హామ్ల వరకు జరిమానా, జైలుశిక్షలు విధించనున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







