ఇరాన్లో 5.3 భూకంపం.. యూఏఈలోనూ ప్రకంపనలు
- July 24, 2022
యూఏఈ: దక్షిణ ఇరాన్లో 5.3 భూకంపం సంభవించిన తర్వాత శనివారం రాత్రి 8:00 గంటలకు యూఏఈలో కూడా పలు ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చినట్లు అధికారవర్గ నివేదికలు తెలిపాయి. బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఖతార్లో కూడా ప్రకంపనలు సంభవించాయి. రాత్రి 8:07 గంటలకు భూకంపాన్ని నివాసితులు అనుభవించినట్లు NCM నివేదించింది. అయితే యుఎఇలో దాని ప్రభావం లేదని తెలిపింది. దక్షిణ ఇరాన్లో శనివారం 5.5 తీవ్రతతో భూకంపం సంభవించిందని యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) శనివారం తెలిపింది. భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు EMSC వెల్లడించింది. ఈ భూకంపంలో ప్రాణ నష్టం గురించి ఇప్పుడే చెప్పలేమని, కాని దీనివల్ల పెద్ద ప్రాంతాలు దెబ్బతిన్నాయని హార్మోజ్గాన్ ప్రావిన్స్ రెడ్ క్రెసెంట్ అధిపతి మొఖ్తర్ సలాషౌర్ చెప్పారు. మరోవైపు భూకంపాలు 5.7, 5.8 తీవ్రతతో వచ్చాయని ఇరాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది. తాజా భూకంప కేంద్రానికి సమీప ప్రాంతంలో జూలై ప్రారంభంలో 6.1 తీవ్రతతో వచ్చిన భూకంపం కారణంగా ఐదుగురు మరణించగా.. 49 మంది గాయపడ్డ విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- యూఏఈ ఉద్యోగులకు అలర్ట్: సెలవుల్లో పని చేయమని బాస్ ఒత్తిడి చేస్తున్నారా?
- సెయింట్ లూయిస్లో NATS ఉచిత వైద్య శిబిరం, రక్తదానం
- తెలంగాణ: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ప్రపంచ దేశాలకు ట్రంప్ వార్నింగ్
- సమిష్టి కృషితోనే స్పోర్ట్స్ మీట్ విజయవంతం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇంటి వద్దకే రైలు పార్సిల్ సేవలు!
- శ్రీవారి పుష్కరిణిలో తెప్పోత్సవాల ట్రయల్ రన్
- రైల్వే అలర్ట్.. మార్చి 1 నుంచి ‘UTS’ యాప్ క్లోజ్
- ఏప్రిల్ 1 నుంచి క్రెడిట్ కార్డ్ కొత్త రూల్స్
- విద్యార్థులకు సోషల్ మీడియా నిషేధమా? ఏపీ కీలక నిర్ణయం









