ఇరాన్లో 5.3 భూకంపం.. యూఏఈలోనూ ప్రకంపనలు
- July 24, 2022
యూఏఈ: దక్షిణ ఇరాన్లో 5.3 భూకంపం సంభవించిన తర్వాత శనివారం రాత్రి 8:00 గంటలకు యూఏఈలో కూడా పలు ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చినట్లు అధికారవర్గ నివేదికలు తెలిపాయి. బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఖతార్లో కూడా ప్రకంపనలు సంభవించాయి. రాత్రి 8:07 గంటలకు భూకంపాన్ని నివాసితులు అనుభవించినట్లు NCM నివేదించింది. అయితే యుఎఇలో దాని ప్రభావం లేదని తెలిపింది. దక్షిణ ఇరాన్లో శనివారం 5.5 తీవ్రతతో భూకంపం సంభవించిందని యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) శనివారం తెలిపింది. భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు EMSC వెల్లడించింది. ఈ భూకంపంలో ప్రాణ నష్టం గురించి ఇప్పుడే చెప్పలేమని, కాని దీనివల్ల పెద్ద ప్రాంతాలు దెబ్బతిన్నాయని హార్మోజ్గాన్ ప్రావిన్స్ రెడ్ క్రెసెంట్ అధిపతి మొఖ్తర్ సలాషౌర్ చెప్పారు. మరోవైపు భూకంపాలు 5.7, 5.8 తీవ్రతతో వచ్చాయని ఇరాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది. తాజా భూకంప కేంద్రానికి సమీప ప్రాంతంలో జూలై ప్రారంభంలో 6.1 తీవ్రతతో వచ్చిన భూకంపం కారణంగా ఐదుగురు మరణించగా.. 49 మంది గాయపడ్డ విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







