ఇరాన్లో 5.3 భూకంపం.. యూఏఈలోనూ ప్రకంపనలు
- July 24, 2022
యూఏఈ: దక్షిణ ఇరాన్లో 5.3 భూకంపం సంభవించిన తర్వాత శనివారం రాత్రి 8:00 గంటలకు యూఏఈలో కూడా పలు ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చినట్లు అధికారవర్గ నివేదికలు తెలిపాయి. బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఖతార్లో కూడా ప్రకంపనలు సంభవించాయి. రాత్రి 8:07 గంటలకు భూకంపాన్ని నివాసితులు అనుభవించినట్లు NCM నివేదించింది. అయితే యుఎఇలో దాని ప్రభావం లేదని తెలిపింది. దక్షిణ ఇరాన్లో శనివారం 5.5 తీవ్రతతో భూకంపం సంభవించిందని యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) శనివారం తెలిపింది. భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు EMSC వెల్లడించింది. ఈ భూకంపంలో ప్రాణ నష్టం గురించి ఇప్పుడే చెప్పలేమని, కాని దీనివల్ల పెద్ద ప్రాంతాలు దెబ్బతిన్నాయని హార్మోజ్గాన్ ప్రావిన్స్ రెడ్ క్రెసెంట్ అధిపతి మొఖ్తర్ సలాషౌర్ చెప్పారు. మరోవైపు భూకంపాలు 5.7, 5.8 తీవ్రతతో వచ్చాయని ఇరాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది. తాజా భూకంప కేంద్రానికి సమీప ప్రాంతంలో జూలై ప్రారంభంలో 6.1 తీవ్రతతో వచ్చిన భూకంపం కారణంగా ఐదుగురు మరణించగా.. 49 మంది గాయపడ్డ విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- దేశంలోనే తొలిసారి.. విమానాన్ని వేలం వేసిన ED..
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!
- డమాస్కస్ కేఫ్ బాంబు దాడిని ఖండించిన ఒమన్..!!
- ఖతార్ అంతటా కస్టమర్ సాటిస్పెక్షన్ సర్వే 2026..!!
- జూన్ నెలలో 911 నెంబర్ కు 26 లక్షల కాల్స్..!!
- యూఏఈలో చిల్డ్రన్ మీడియా కంటెంట్ కోసం కొత్త ప్రమాణాలు..!!
- సింగిల్ స్క్రీన్ థియేటర్లకు ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రోత్సాహకాలు
- జర్మనీలో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ అవకాశం..
- ముగిసిన తెలంగాణ ‘ఈ కేబినెట్’ భేటీ.. మూసీ ప్రాజెక్టు ఫేజ్-1కు ఆమోదం







