మాటలు, సైగలతో విమర్శించినా శిక్షార్హులే.. !

- July 24, 2022 , by Maagulf
మాటలు, సైగలతో విమర్శించినా శిక్షార్హులే.. !

కాబూల్‌: అఫ్ఘనిస్థాన్‌లో పాలన పగ్గాలు చేపట్టిన తాలిబన్‌ ప్రభుత్వం కఠిన ఆదేశాలు జారీ చేస్తోంది. ఇప్పటికే బాలికల విద్యపై నిషేధం విధించడంతో పాటు మహిళా ఉద్యోగులపై కఠిన ఆంక్షలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.తాజాగా ప్రభుత్వ ఉద్యోగులు, మేధావులను విమర్శించే వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది.

మాటలు, సైగలతో ఇలా ఏ విధంగా విమర్శించినా వారు శిక్షార్హులని ఆదేశాలు జారీ చేశారు. తాలిబన్‌ల అగ్ర నేత అఖుంద్‌జాదా ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రతినిధి జబియుల్లా ముజాహిద్‌ ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేశారు. ప్రభుత్వంపై చేసే విమర్శలు పరోక్షంగా శత్రువులకు సాయం చేస్తాయని తాలిబన్లు అంటున్నారు. కొత్త ఉత్తర్వుల ప్రకారం..

ఎవరైనా తాలిబన్‌ సైనికుడిని తాకినా, లేదా అతని దుస్తులు లాగినా, చెడుగా మాట్లాడినా శిక్షార్హమైన నేరంగా పరిగణించనున్నారు. అయితే ఎలాంటి శిక్షలు విధించనున్నారనే అంశంపై స్పష్టత లేదు. ఈ ఆదేశాలను నిపుణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వీటితో వాక్‌స్వాతంత్య్రం, భావప్రకటన స్వేచ్ఛకు తీవ్ర భంగం కలుగుతుందని విద్యావేత్తలు, నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com