మాటలు, సైగలతో విమర్శించినా శిక్షార్హులే.. !
- July 24, 2022
కాబూల్: అఫ్ఘనిస్థాన్లో పాలన పగ్గాలు చేపట్టిన తాలిబన్ ప్రభుత్వం కఠిన ఆదేశాలు జారీ చేస్తోంది. ఇప్పటికే బాలికల విద్యపై నిషేధం విధించడంతో పాటు మహిళా ఉద్యోగులపై కఠిన ఆంక్షలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.తాజాగా ప్రభుత్వ ఉద్యోగులు, మేధావులను విమర్శించే వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది.
మాటలు, సైగలతో ఇలా ఏ విధంగా విమర్శించినా వారు శిక్షార్హులని ఆదేశాలు జారీ చేశారు. తాలిబన్ల అగ్ర నేత అఖుంద్జాదా ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రతినిధి జబియుల్లా ముజాహిద్ ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేశారు. ప్రభుత్వంపై చేసే విమర్శలు పరోక్షంగా శత్రువులకు సాయం చేస్తాయని తాలిబన్లు అంటున్నారు. కొత్త ఉత్తర్వుల ప్రకారం..
ఎవరైనా తాలిబన్ సైనికుడిని తాకినా, లేదా అతని దుస్తులు లాగినా, చెడుగా మాట్లాడినా శిక్షార్హమైన నేరంగా పరిగణించనున్నారు. అయితే ఎలాంటి శిక్షలు విధించనున్నారనే అంశంపై స్పష్టత లేదు. ఈ ఆదేశాలను నిపుణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వీటితో వాక్స్వాతంత్య్రం, భావప్రకటన స్వేచ్ఛకు తీవ్ర భంగం కలుగుతుందని విద్యావేత్తలు, నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ ఉద్యోగులకు అలర్ట్: సెలవుల్లో పని చేయమని బాస్ ఒత్తిడి చేస్తున్నారా?
- సెయింట్ లూయిస్లో NATS ఉచిత వైద్య శిబిరం, రక్తదానం
- తెలంగాణ: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ప్రపంచ దేశాలకు ట్రంప్ వార్నింగ్
- సమిష్టి కృషితోనే స్పోర్ట్స్ మీట్ విజయవంతం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇంటి వద్దకే రైలు పార్సిల్ సేవలు!
- శ్రీవారి పుష్కరిణిలో తెప్పోత్సవాల ట్రయల్ రన్
- రైల్వే అలర్ట్.. మార్చి 1 నుంచి ‘UTS’ యాప్ క్లోజ్
- ఏప్రిల్ 1 నుంచి క్రెడిట్ కార్డ్ కొత్త రూల్స్
- విద్యార్థులకు సోషల్ మీడియా నిషేధమా? ఏపీ కీలక నిర్ణయం









