మాటలు, సైగలతో విమర్శించినా శిక్షార్హులే.. !
- July 24, 2022
కాబూల్: అఫ్ఘనిస్థాన్లో పాలన పగ్గాలు చేపట్టిన తాలిబన్ ప్రభుత్వం కఠిన ఆదేశాలు జారీ చేస్తోంది. ఇప్పటికే బాలికల విద్యపై నిషేధం విధించడంతో పాటు మహిళా ఉద్యోగులపై కఠిన ఆంక్షలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.తాజాగా ప్రభుత్వ ఉద్యోగులు, మేధావులను విమర్శించే వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది.
మాటలు, సైగలతో ఇలా ఏ విధంగా విమర్శించినా వారు శిక్షార్హులని ఆదేశాలు జారీ చేశారు. తాలిబన్ల అగ్ర నేత అఖుంద్జాదా ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రతినిధి జబియుల్లా ముజాహిద్ ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేశారు. ప్రభుత్వంపై చేసే విమర్శలు పరోక్షంగా శత్రువులకు సాయం చేస్తాయని తాలిబన్లు అంటున్నారు. కొత్త ఉత్తర్వుల ప్రకారం..
ఎవరైనా తాలిబన్ సైనికుడిని తాకినా, లేదా అతని దుస్తులు లాగినా, చెడుగా మాట్లాడినా శిక్షార్హమైన నేరంగా పరిగణించనున్నారు. అయితే ఎలాంటి శిక్షలు విధించనున్నారనే అంశంపై స్పష్టత లేదు. ఈ ఆదేశాలను నిపుణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వీటితో వాక్స్వాతంత్య్రం, భావప్రకటన స్వేచ్ఛకు తీవ్ర భంగం కలుగుతుందని విద్యావేత్తలు, నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
తాజా వార్తలు
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..
- 'బెల్ ఆఫ్ ఆర్మ్స్', 'సారథి' సెంట్రల్ వర్క్షాప్ను ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- మా కృషి వల్లే జిందాల్ స్టీల్ నిర్మాణం: జగన్
- షార్జా ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల కాన్సులర్ అటెస్టేషన్ సేవలు
- గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన పవన్ కల్యాణ్
- దేశంలోనే తొలిసారి.. విమానాన్ని వేలం వేసిన ED..
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!
- డమాస్కస్ కేఫ్ బాంబు దాడిని ఖండించిన ఒమన్..!!







