జపాన్లో బద్ధలైన అగ్నిపర్వతం..
- July 24, 2022
టోక్యో: జపాన్లో భారీ అగ్నిపర్వతం బద్ధలైంది. జపాన్ ఉత్తర భాగంలో ఉన్న క్యుషు (సకురజిమా) అనే పర్వత పరిధిలో ఉన్న అగ్నిపర్వతం ఆదివారం బద్ధలైంది. భారత కాలమానం ప్రకారం.. ఆదివారం సాయంత్రం పర్వతం బద్ధలై, లావా ఉప్పొంగుతున్నట్లు జపాన్ వాతావరణ శాఖ (జేఎమ్ఏ) వెల్లడించింది.
దీని ప్రభావం తీవ్రంగా ఉండటతో ఐదో నెంబర్ ప్రమాద సూచిక జారీ చేశారు.దీన్ని హై అలర్ట్ కింద పరిగణిస్తారు. ప్రస్తుతం దీని ప్రభావం తీవ్రంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. దాదాపు రెండున్నర కిలోమీటర్ల వరకు లావాకు చెందిన శిలలు ఎగిసిపడుతున్నాయి. మండుతున్న శిలలు ఎగిరిపడుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల్ని ఖాళీ చేయాల్సిందిగా అధికారులు సూచించారు. ప్రస్తుతం బద్ధలైన అగ్నిపర్వతానికి సమీపంలో కగోషిమా అనే పట్టణం ఉంది. ఇక్కడ దాదాపు ఆరు లక్షల మంది నివసిస్తున్నారు. సకురజిమ జపాన్లో అత్యంత ప్రమాదకర అగ్నిపర్వతం. ఇక్కడ తరచూ లావా బద్ధలవుతుంటుంది. 2019లో 5.5 కిలోమీటర్ల మేర లావా ఎగసిపడింది.
జపాన్ భూభాగం ఎక్కువగా టెక్టానిక్ ప్లేట్స్ పరిధిలో ఉండటంతో ఇక్కడ భూకంపాలు రావడంతోపాటు, అగ్నిపర్వతాలు, సునామీలు వంటివి ఎక్కువగా వస్తుంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఏటా నమోదయ్యే భూకంపాల్లో 20 శాతం జపాన్లోనే నమోదవుతుండటం గమనార్హం.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం విస్తరణ..!!
- యూఏఈలో రాబోయే మూడు సంవత్సరాలకు అకాడమిక్ క్యాలండర్ రిలీజ్..!!
- ఇజ్కిలో ట్రక్కు బోల్తా..అగ్నికి ఆహుతి..!!
- యూఏఈ ఉద్యోగులకు అలర్ట్: సెలవుల్లో పని చేయమని బాస్ ఒత్తిడి చేస్తున్నారా?
- సెయింట్ లూయిస్లో NATS ఉచిత వైద్య శిబిరం, రక్తదానం
- తెలంగాణ: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ప్రపంచ దేశాలకు ట్రంప్ వార్నింగ్
- సమిష్టి కృషితోనే స్పోర్ట్స్ మీట్ విజయవంతం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇంటి వద్దకే రైలు పార్సిల్ సేవలు!
- శ్రీవారి పుష్కరిణిలో తెప్పోత్సవాల ట్రయల్ రన్









