జపాన్లో బద్ధలైన అగ్నిపర్వతం..
- July 24, 2022
టోక్యో: జపాన్లో భారీ అగ్నిపర్వతం బద్ధలైంది. జపాన్ ఉత్తర భాగంలో ఉన్న క్యుషు (సకురజిమా) అనే పర్వత పరిధిలో ఉన్న అగ్నిపర్వతం ఆదివారం బద్ధలైంది. భారత కాలమానం ప్రకారం.. ఆదివారం సాయంత్రం పర్వతం బద్ధలై, లావా ఉప్పొంగుతున్నట్లు జపాన్ వాతావరణ శాఖ (జేఎమ్ఏ) వెల్లడించింది.
దీని ప్రభావం తీవ్రంగా ఉండటతో ఐదో నెంబర్ ప్రమాద సూచిక జారీ చేశారు.దీన్ని హై అలర్ట్ కింద పరిగణిస్తారు. ప్రస్తుతం దీని ప్రభావం తీవ్రంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. దాదాపు రెండున్నర కిలోమీటర్ల వరకు లావాకు చెందిన శిలలు ఎగిసిపడుతున్నాయి. మండుతున్న శిలలు ఎగిరిపడుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల్ని ఖాళీ చేయాల్సిందిగా అధికారులు సూచించారు. ప్రస్తుతం బద్ధలైన అగ్నిపర్వతానికి సమీపంలో కగోషిమా అనే పట్టణం ఉంది. ఇక్కడ దాదాపు ఆరు లక్షల మంది నివసిస్తున్నారు. సకురజిమ జపాన్లో అత్యంత ప్రమాదకర అగ్నిపర్వతం. ఇక్కడ తరచూ లావా బద్ధలవుతుంటుంది. 2019లో 5.5 కిలోమీటర్ల మేర లావా ఎగసిపడింది.
జపాన్ భూభాగం ఎక్కువగా టెక్టానిక్ ప్లేట్స్ పరిధిలో ఉండటంతో ఇక్కడ భూకంపాలు రావడంతోపాటు, అగ్నిపర్వతాలు, సునామీలు వంటివి ఎక్కువగా వస్తుంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఏటా నమోదయ్యే భూకంపాల్లో 20 శాతం జపాన్లోనే నమోదవుతుండటం గమనార్హం.
తాజా వార్తలు
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..
- 'బెల్ ఆఫ్ ఆర్మ్స్', 'సారథి' సెంట్రల్ వర్క్షాప్ను ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- మా కృషి వల్లే జిందాల్ స్టీల్ నిర్మాణం: జగన్
- షార్జా ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల కాన్సులర్ అటెస్టేషన్ సేవలు
- గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన పవన్ కల్యాణ్
- దేశంలోనే తొలిసారి.. విమానాన్ని వేలం వేసిన ED..
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!







