రోడ్డు పనుల్ని వేగవంతం చేయాలి
- April 13, 2016
పబ్లిక్ వర్క్స్ అథారిటీ (అష్గల్) వీధులు, రోడ్లపై చేపడుతున్న పనుల్ని వేగంగా పూర్తి చేయాలని సెంట్రల్ మున్సిపల్ కౌన్సిల్ (సిఎంసి) కోరింది. పగుళ్ళు, తవ్వకాలు వంటి పనులను వేగంగా పూర్తి చేయాలని, దీని కోసం తగిన చర్యలు చేపట్టాలని సిఎంసీ విజ్ఞప్తి చేయడం జరిగింది. సిఎంసి మెంబర్ నెమ్మదిగా పనులు జరుగుతున్న అంశాన్ని ప్రస్తావించారు. టెలిఫోన్ లైన్లు, వాటర్ లైన్స్, అలాగే ఎలక్ట్రిసిటీ సప్లయ్ కేబుల్స్ కోసం రోడ్ల మధ్యన తవ్వకాలు చేపట్టరాదనీ, రోడ్ల పక్కనే ఎక్కువ ఇబ్బందులు లేకుండా పనులు చేయాలని సిఎంసి సూచించింది. కాంట్రాక్టర్లు చేస్తున్న పనుల్ని అష్గల్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, టెక్నాలజీని వినియోగించుకునే దిశగా కాంట్రాక్టర్లపై ఒత్తిడి తేవాలని కోరింది. అలాగే, మహిళా వస్త్ర దుకాణాల్లో పనిచేయడానికి పురుషులకు అవకాశం లేకుండా కేవలం మహిళలకే అవకాశం ఇవ్వాలన్న రికమండేషన్పై, మినిస్టర్ ఆఫ్ మునిసిపాలిటీ అండ్ ఎన్విరాన్మెంట్కి ఫిర్యాదులు రాగా, దాన్ని మినిస్టర్ ఆఫ్ ఎకానమీ అండ్ కామర్స్కి దాన్ని రిఫర్ చేశారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









