రోడ్డు పనుల్ని వేగవంతం చేయాలి
- April 13, 2016
పబ్లిక్ వర్క్స్ అథారిటీ (అష్గల్) వీధులు, రోడ్లపై చేపడుతున్న పనుల్ని వేగంగా పూర్తి చేయాలని సెంట్రల్ మున్సిపల్ కౌన్సిల్ (సిఎంసి) కోరింది. పగుళ్ళు, తవ్వకాలు వంటి పనులను వేగంగా పూర్తి చేయాలని, దీని కోసం తగిన చర్యలు చేపట్టాలని సిఎంసీ విజ్ఞప్తి చేయడం జరిగింది. సిఎంసి మెంబర్ నెమ్మదిగా పనులు జరుగుతున్న అంశాన్ని ప్రస్తావించారు. టెలిఫోన్ లైన్లు, వాటర్ లైన్స్, అలాగే ఎలక్ట్రిసిటీ సప్లయ్ కేబుల్స్ కోసం రోడ్ల మధ్యన తవ్వకాలు చేపట్టరాదనీ, రోడ్ల పక్కనే ఎక్కువ ఇబ్బందులు లేకుండా పనులు చేయాలని సిఎంసి సూచించింది. కాంట్రాక్టర్లు చేస్తున్న పనుల్ని అష్గల్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, టెక్నాలజీని వినియోగించుకునే దిశగా కాంట్రాక్టర్లపై ఒత్తిడి తేవాలని కోరింది. అలాగే, మహిళా వస్త్ర దుకాణాల్లో పనిచేయడానికి పురుషులకు అవకాశం లేకుండా కేవలం మహిళలకే అవకాశం ఇవ్వాలన్న రికమండేషన్పై, మినిస్టర్ ఆఫ్ మునిసిపాలిటీ అండ్ ఎన్విరాన్మెంట్కి ఫిర్యాదులు రాగా, దాన్ని మినిస్టర్ ఆఫ్ ఎకానమీ అండ్ కామర్స్కి దాన్ని రిఫర్ చేశారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!







