బ్యాంక్ కస్టమర్లను మోసం చేసిన 23 మంది అరెస్టు
- July 27, 2022
జెడ్డా: బ్యాంక్ కస్టమర్లను మోసం చేసిన కేసులో 23 మంది విదేశీ నివాసితులను సౌదీ అరేబియాలోని పోలీసులు అరెస్టు చేశారు. ఏటీఎం కార్డులు బ్లాక్ అయ్యాయంటూ బ్యాంకు ఉద్యోగులుగా నటిస్తూ బాధితులకు మెసేజ్ లు పంపేవారని, బాధితులు తమ కార్డులను తిరిగి యాక్టివేట్ చేయాలంటే ఓటీపీ నంబర్లను తెలపాలని కోరేవారని, ఓటీపీ నెంబర్ చెప్పగానే నిందితులు బాధితుల బ్యాంకు ఖాతాల నుండి నిధులను విత్డ్రా చేసేవారని పోలీసులు వివరించారు. జెడ్డా పరిసరాల్లోని సెమీ ఎడారి ప్రాంగణాలను నిందితులు తమ స్థావరంగా మార్చుకున్నారని.. నిందితుల వద్ద నుంచి 46 మొబైల్ ఫోన్లు, 59 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారిని పబ్లిక్ ప్రాసిక్యూషన్కు తరలించినట్లు పోలీసులు వివరించారు.
తాజా వార్తలు
- జర్మనీలో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ అవకాశం..
- ముగిసిన తెలంగాణ ‘ఈ కేబినెట్’ భేటీ.. మూసీ ప్రాజెక్టు ఫేజ్-1కు ఆమోదం
- దుబాయ్లో ట్యాక్సీ డ్రైవర్లకు భారీ ఉద్యోగావకాశం
- భారత్-జపాన్ AI ఒప్పందం: టెక్ రంగంలో భారీ మార్పులు
- విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్..
- తెలుగు రాష్ట్రాలకు వాతావరణ హెచ్చరిక.. 7 రోజుల పాటు భారీ వర్షాలు
- యూఏఈ ఎమిరేట్స్ ఐడితో ఫ్రాడ్ రిస్క్..డేటా ప్రొటెక్షన్ గైడ్..!!
- ఇరాన్ దురాక్రమణ పై యూఎన్ఓలో బహ్రెయిన్ ఫైర్..!!
- ఉత్తర అల్ షర్కియాలో భారీగా పొగాకు ఉత్పత్తులు స్వాధీనం..!!
- సౌదీలో లేబర్ తనిఖీలు.. 80వేల సౌదీకరణ ఉల్లంఘనలు..!!







