బ్యాంక్ కస్టమర్లను మోసం చేసిన 23 మంది అరెస్టు
- July 27, 2022
జెడ్డా: బ్యాంక్ కస్టమర్లను మోసం చేసిన కేసులో 23 మంది విదేశీ నివాసితులను సౌదీ అరేబియాలోని పోలీసులు అరెస్టు చేశారు. ఏటీఎం కార్డులు బ్లాక్ అయ్యాయంటూ బ్యాంకు ఉద్యోగులుగా నటిస్తూ బాధితులకు మెసేజ్ లు పంపేవారని, బాధితులు తమ కార్డులను తిరిగి యాక్టివేట్ చేయాలంటే ఓటీపీ నంబర్లను తెలపాలని కోరేవారని, ఓటీపీ నెంబర్ చెప్పగానే నిందితులు బాధితుల బ్యాంకు ఖాతాల నుండి నిధులను విత్డ్రా చేసేవారని పోలీసులు వివరించారు. జెడ్డా పరిసరాల్లోని సెమీ ఎడారి ప్రాంగణాలను నిందితులు తమ స్థావరంగా మార్చుకున్నారని.. నిందితుల వద్ద నుంచి 46 మొబైల్ ఫోన్లు, 59 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారిని పబ్లిక్ ప్రాసిక్యూషన్కు తరలించినట్లు పోలీసులు వివరించారు.
తాజా వార్తలు
- జీసీసీ, మిడిల్ ఈస్ట్ అంతటా 700 కి పైగా విమానాలు రద్దు..!!
- ఒమన్లో వరుస దాడులు
- ఖతార్ లోని ఇండస్ట్రియల్ ఏరాలో అగ్నిప్రమాదం..!!
- ప్రయాణికులు ఎమిరేట్స్ కీలక సూచనలు..!!
- బ్రేకింగ్: గల్ఫ్ దేశాల్లో రేపటి CBSE పరీక్షలు వాయిదా!
- మిడిల్ ఈస్ట్ లో యుద్ధ ఉధృతి: విమాన ప్రయాణికులకు ముఖ్య గమనిక
- ఇవాళ్టి నుంచి బస్సుల్లో దివ్యాంగులకు ఫ్రీ జర్నీ
- దుబాయ్ లో అడ్డగించిన డ్రోన్ల అవశేషాలు ఇళ్ల ఆవరణల్లో పడి ఇద్దరు గాయాలు
- ఇరాన్కు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
- డీప్ ఫేక్ వీడియోలతో దుష్ప్రచారం: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు









