బ్యాంక్ కస్టమర్లను మోసం చేసిన 23 మంది అరెస్టు
- July 27, 2022
జెడ్డా: బ్యాంక్ కస్టమర్లను మోసం చేసిన కేసులో 23 మంది విదేశీ నివాసితులను సౌదీ అరేబియాలోని పోలీసులు అరెస్టు చేశారు. ఏటీఎం కార్డులు బ్లాక్ అయ్యాయంటూ బ్యాంకు ఉద్యోగులుగా నటిస్తూ బాధితులకు మెసేజ్ లు పంపేవారని, బాధితులు తమ కార్డులను తిరిగి యాక్టివేట్ చేయాలంటే ఓటీపీ నంబర్లను తెలపాలని కోరేవారని, ఓటీపీ నెంబర్ చెప్పగానే నిందితులు బాధితుల బ్యాంకు ఖాతాల నుండి నిధులను విత్డ్రా చేసేవారని పోలీసులు వివరించారు. జెడ్డా పరిసరాల్లోని సెమీ ఎడారి ప్రాంగణాలను నిందితులు తమ స్థావరంగా మార్చుకున్నారని.. నిందితుల వద్ద నుంచి 46 మొబైల్ ఫోన్లు, 59 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారిని పబ్లిక్ ప్రాసిక్యూషన్కు తరలించినట్లు పోలీసులు వివరించారు.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







