ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థులకు భారత్ షాక్
- July 28, 2022
న్యూఢిల్లీ: ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ప్రకటించిన తర్వాత అక్కడి నుంచి తట్టాబుట్టా సర్దుకుని స్వదేశానికి చేరుకున్న భారతీయ విద్యార్థులకు కేంద్రం షాకిచ్చింది.
సగం చదువులతో ఉక్రెయిన్ నుంచి వచ్చి ఇక్కడ వాటిని పూర్తి చేస్తామంటే కుదరదని స్పష్టం చేసింది. రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానంగా కేంద్రం ఈ విషయాన్ని వెల్లడించింది. దేశంలోని క్షేత్రస్థాయి పరిస్థితులు ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థులు చదువును కొనసాగించేందుకు అనుమతించవని పేర్కొంది.
ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రారంభించిన తర్వాత దాదాపు 20 వేల మంది విద్యార్థులు భారత్కు తిరిగి వచ్చారు. తమ చదువులు సగంలో ఆగిపోవడంతో మిగతా చదువును పూర్తి చేసేందుకు తమకు అనుమతి ఇవ్వాల్సిందిగా వారంతా భారత ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. అయితే, ప్రస్తుతానికైతే వారికి అనుమతి ఇవ్వలేమని కేంద్రం తేల్చి చెప్పింది.
ఉక్రెయిన్ విద్యాశాఖ అధికారులతో తాము సంప్రదింపులు జరుపుతున్నామని, ఆన్లైన్ కోర్సులను కొనసాగించేందుకు వారు హామీ ఇచ్చారని కేంద్రం పేర్కొంది. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ చట్టం 1956, నేషనల్ మెడికల్ కమిషన్ చట్టం 2019 ప్రకారం.. ఏదైనా విదేశీ మెడికల్ కాలేజీ నుంచి వచ్చిన భారతీయ వైద్య విద్యార్థులకు ఇక్కడి మెడికల్ కళాశాలలో వసతి కల్పించడానికి కానీ, లేదంటే బదిలీ చేయడానికి సంబంధించిన నిబంధనలు లేవని స్పష్టం చేసింది.
కేంద్ర చేసిన ఈ ప్రకటన తర్వాత యుక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థు తీవ్ర నిరాశకు గురయ్యారు.సామాజిక మాధ్యమాల వేదికగా తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. తామిక్కడ చదువును కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!







