కాంగ్రెస్ నేతలతో సోనియా అత్యవసర భేటీ
- July 28, 2022
న్యూ ఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును అవమానించేలా ‘రాష్ట్రపత్ని’ అంటూ కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదురి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలకు నిరసనగా పార్లమెంటులో బీజేపీకి చెందిన మహిళా ఎంపీలు ఆందోళన చేస్తున్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ క్షమాపణ చెప్పాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
గురువారం ఉదయం నుంచి పార్లమెంట్లో ఆందోళన కొనసాగుతుండటంతో సభను వాయిదా వేశారు. మరోవైపు అధిర్ చౌదరి వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు రావడంతో కాంగ్రెస్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. పార్టీ కీలక నేతలతో సోనియా గాంధీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీకి చెందిన కీలక నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. మల్లికార్జున ఖర్గే, అధిర్ చౌదురి, ఇతర నేతలు హాజరయ్యారు. రాష్ట్రపత్ని వ్యాఖ్యలు, బీజేపీ ఆందోళన నేపథ్యంలో కాంగ్రెస్ అనుసరించాల్సిన వైఖరిపై ఈ సమావేశంలో చర్చించారు. మరోవైపు తన వ్యాఖ్యలపై అధిర్ చౌదురి విచారం వ్యక్తం చేశారు. పొరపాటున ఈ వ్యాఖ్యలు చేశానని చెప్పారు.
రాష్ట్రపతి ఏ వర్గానికి చెందిన వారైనా రాష్ట్రపతే అని, క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఏముందని ఆయన అన్నారు. సోనియా గాంధీ కూడా ఈ అంశంపై స్పందించారు. అధిర్ చౌదురి ఇప్పటికే క్షమాపణలు చెప్పారని, ఈ అంశాన్ని వదిలేయాలని కోరారు. మరోవైపు పార్లమెంటులో అధిర్ చౌదురి క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







