షహీద్ సుఖ్ దేవ్ కు లూథియానా లో డా.గజల్ శ్రీనివాస్ గాన నీరాజనం

- July 30, 2022 , by Maagulf
షహీద్ సుఖ్ దేవ్ కు లూథియానా లో డా.గజల్ శ్రీనివాస్ గాన నీరాజనం

పంజాబ్: అజాదీక అమృత మహోత్సవం లో భాగంగా షహీద్ సుఖ్ దేవ్ కు లూథియానా , పంజాబ్ లో 31 జూలై 2022 న గురునానక్ ఆడిటోరియంలో ఉదయం 10 గంటలకు జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ప్రఖ్యాత గజల్ గాయకుడు డా.గజల్ శ్రీనివాస్ ప్రత్యేక గీతం తో నివాళి ఇవ్వనున్నారు.

ముఖ్య అతిధిగా కేంద్ర సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి విచ్చేయనున్నారని, ఝాన్సీ లక్ష్మీ భాయ్,తాంతియా తోపే,మంగళ్ పాండే,భగత్ సింగ్,ఆష్ఫకుల్లా ఖాన్,రాజగురు, నేతాజీ సుభాష్ చంద్ర బోస్,రాజ్ త్రిపాఠి,లాలా లజపతి రాయ్,గోవింద్ గురు,చంద్ర శేఖర్ ఆజాద్, కెప్టెన్ పూల్ సింగ్,ఠాకూర్ దుర్గా సింగ్,వీర్ సావర్కర్  మొదలగు షహీద్ కుటుంబ సభ్యులు గౌరవ అతిధులుగా పాల్గొననున్నారని కార్యక్రమ సంచాలకులు షహీద్ సుఖ్ దేవ్ మనుమడు విశాల్ నయ్యర్ సుఖ్ దేవ్ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com