వివిధ కేసుల్లో 78 మందిని అరెస్టు చేసిన నజహా
- July 31, 2022
రియాద్: లంచం, మనీ లాండరింగ్ మరియు ఫోర్జరీ కేసుల్లో ఇప్పటి వరకు 78 మందిని అరెస్టు చేసినట్లు సౌదీ అరేబియా అవినీతి నిరోధక శాఖ(Nazaha) ప్రకటించింది.
దేశవ్యాప్తంగా ఉన్న అవినీతి ఆరోపణల కేసులు అధికం అవుతున్న నేపథ్యంలో నజహా విభాగం క్రియాశీలకంగా వ్యవహరించడం మొదలు పెట్టింది.
ఇప్పటికే రక్షణ , ఆరోగ్య , న్యాయ , విద్యా, మున్సిపల్ మరియు గ్రామీణ వ్యవహారాలు& హౌసింగ్ మంత్రిత్వ శాఖ ల పరిధిలో ఉన్న అవినీతి ఆరోపణల కేసులను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన నజహా అవినీతికి పాల్పడిన వారిని అరెస్టు చేసినట్లు నాజా అధికారులు తెలిపారు.
ఇప్పటి వరకు 78 మందిని అరెస్ట్ చేయగా మరో 116 మంది పై వివిధ కేసుల్లో విచారణ జరుగుతుందని అధికారులు పేర్కొన్నారు. అయితే అరెస్ట్ చేసిన 78 మంది నిందితుల్లో పలు కారణాలతో బెయిల్ మీద విడుదల అయ్యారు.
దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పాల్పడుతున్న వారిపై ప్రజలు నిర్భయంగా ఫిర్యాదు చేయవచ్చని నజహా ప్రతినిధులు తెలిపారు. ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నంబర్ 980 , ఈమెయిల్ ఐడి: [email protected] లను ప్రకటించారు.
తాజా వార్తలు
- దగ్గు మందు మరణాల పై సుప్రీంకోర్టు ఆగ్రహం
- తెలంగాణ: వచ్చే నెల నుంచి పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం ఫ్రీ..
- పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశంలో SANKALP పథక అమలు పై సమగ్ర సమీక్ష
- ఇక పై ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలో ఫ్రీ ఎడ్యుకేషన్
- హైదరాబాద్: మైత్రీవనంలో భారీ అగ్నిప్రమాదం
- ఉదయం మాజీ యువరాజు ఆండ్రూ అరెస్ట్..రాత్రికి విడుదల
- పరువు నష్టం కేసు విచారణకు హాజరైన రాహుల్ గాంధీ
- ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల: మంత్రి లోకేష్
- ఇరాన్కు ట్రంప్ అల్టిమేటం..15 రోజుల డెడ్లైన్!
- పబ్లిక్ పాస్టింగ్ వయోలేషన్..జైలుశిక్ష లేదా BD100 ఫైన్..!!









