వివిధ కేసుల్లో 78 మందిని అరెస్టు చేసిన నజహా
- July 31, 2022
రియాద్: లంచం, మనీ లాండరింగ్ మరియు ఫోర్జరీ కేసుల్లో ఇప్పటి వరకు 78 మందిని అరెస్టు చేసినట్లు సౌదీ అరేబియా అవినీతి నిరోధక శాఖ(Nazaha) ప్రకటించింది.
దేశవ్యాప్తంగా ఉన్న అవినీతి ఆరోపణల కేసులు అధికం అవుతున్న నేపథ్యంలో నజహా విభాగం క్రియాశీలకంగా వ్యవహరించడం మొదలు పెట్టింది.
ఇప్పటికే రక్షణ , ఆరోగ్య , న్యాయ , విద్యా, మున్సిపల్ మరియు గ్రామీణ వ్యవహారాలు& హౌసింగ్ మంత్రిత్వ శాఖ ల పరిధిలో ఉన్న అవినీతి ఆరోపణల కేసులను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన నజహా అవినీతికి పాల్పడిన వారిని అరెస్టు చేసినట్లు నాజా అధికారులు తెలిపారు.
ఇప్పటి వరకు 78 మందిని అరెస్ట్ చేయగా మరో 116 మంది పై వివిధ కేసుల్లో విచారణ జరుగుతుందని అధికారులు పేర్కొన్నారు. అయితే అరెస్ట్ చేసిన 78 మంది నిందితుల్లో పలు కారణాలతో బెయిల్ మీద విడుదల అయ్యారు.
దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పాల్పడుతున్న వారిపై ప్రజలు నిర్భయంగా ఫిర్యాదు చేయవచ్చని నజహా ప్రతినిధులు తెలిపారు. ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నంబర్ 980 , ఈమెయిల్ ఐడి: [email protected] లను ప్రకటించారు.
తాజా వార్తలు
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..
- 'బెల్ ఆఫ్ ఆర్మ్స్', 'సారథి' సెంట్రల్ వర్క్షాప్ను ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- మా కృషి వల్లే జిందాల్ స్టీల్ నిర్మాణం: జగన్
- షార్జా ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల కాన్సులర్ అటెస్టేషన్ సేవలు
- గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన పవన్ కల్యాణ్
- దేశంలోనే తొలిసారి.. విమానాన్ని వేలం వేసిన ED..
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!







