12 మందితో ఏర్పాటు కానున్న కువైట్ నూతన మంత్రివర్గం
- August 01, 2022
కువైట్ సిటీ: 12 మంది సభ్యులతో కువైట్ నూతన మంత్రివర్గం ఏర్పాటు చేయనున్నట్లు నూతన ప్రధాని షేక్ అహ్మద్ నవాఫ్ అల్ సభా వెల్లడించారు.
గత మంత్రివర్గంలో పనిచేసిన ఆర్థిక, ఆయిల్, విదేశాంగ మంత్రులు తిరిగి అదే శాఖల మంత్రులుగా నియమితులయ్యారు.
రక్షణ మంత్రిగా మరియు ఉప ప్రధాని గా షేక్ తలాల్ ఖాలేద్ అల్ అహ్మద్ అల్ సభా నియమితులయ్యారు.
షేక్ నావాఫ్ తన కుమారుడు షేక్ అహ్మద్ కోసం ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేయడంతో అహ్మద్ ప్రధాని పదవి చేపట్టారు.
మంత్రి వర్గం కుర్పును సిద్ధం చేసుకున్న తర్వాత షేక్ అహ్మద్ మర్యాద పూర్వకంగా యువరాజు అమీర్ షేక్ మేషాల్ అల్ అహ్మద్ అల్ సభా ను కలిశారు.
నూతన ప్రధాని దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- నేపాల్కు మరో భారీ వరద ముప్పు: చైనా తీవ్ర హెచ్చరికలు!
- ‘మన దేశ గర్వకారణం’.. ఎమిరాతీ మహిళల సేవలను కొనియాడిన షేక్ మొహమ్మద్
- గ్రాండ్ చెస్ టూర్ విజేతగా ప్రజ్ఞానంద రికార్డ్!
- నేపాల్లో వరదలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఒమన్..!!
- కువైట్లో భారీ డ్రగ్స్ రాకెట్ ఆపరేషన్ భగ్నం..!!
- లైసెన్స్ లేకుండా వన్యప్రాణుల వేట.. నలుగురు సౌదీ పౌరుల అరెస్ట్..!!
- అనుమతి లేని పెప్టైడ్ ఉత్పత్తులపై ఖతార్ నిషేధం..!!
- గల్ఫ్ సైబర్ భద్రతకు బహ్రెయిన్ నాయకత్వం..!!
- మిర్బాత్లో ‘మరాఫీ అల్ లుబాన్’ తుది గడువు పొడిగింపు..!!
- షార్జా దుర్ఘటన.. స్వస్థలానికి బాలిక మృతదేహం తరలింపు..!!







