12 మందితో ఏర్పాటు కానున్న కువైట్ నూతన మంత్రివర్గం

- August 01, 2022 , by Maagulf
12 మందితో ఏర్పాటు కానున్న కువైట్ నూతన మంత్రివర్గం

కువైట్ సిటీ: 12 మంది సభ్యులతో కువైట్ నూతన మంత్రివర్గం ఏర్పాటు చేయనున్నట్లు నూతన ప్రధాని షేక్ అహ్మద్ నవాఫ్ అల్ సభా వెల్లడించారు. 

గత మంత్రివర్గంలో పనిచేసిన ఆర్థిక, ఆయిల్, విదేశాంగ మంత్రులు తిరిగి అదే శాఖల మంత్రులుగా నియమితులయ్యారు. 

 రక్షణ మంత్రిగా మరియు ఉప ప్రధాని గా షేక్ తలాల్ ఖాలేద్ అల్ అహ్మద్ అల్ సభా నియమితులయ్యారు. 

షేక్ నావాఫ్ తన కుమారుడు షేక్ అహ్మద్ కోసం ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేయడంతో అహ్మద్ ప్రధాని పదవి చేపట్టారు. 

మంత్రి వర్గం కుర్పును సిద్ధం చేసుకున్న తర్వాత షేక్ అహ్మద్ మర్యాద పూర్వకంగా యువరాజు అమీర్ షేక్ మేషాల్ అల్ అహ్మద్ అల్ సభా ను కలిశారు.

నూతన ప్రధాని  దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com