తెలంగాణ కరోనా అప్డేట్
- August 01, 2022
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 39వేల 320 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 771 మందికి పాజిటివ్ గా తేలింది. అత్యధికంగా హైదరాబాద్ లో 289 కేసులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో 53 కేసులు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 47 కేసులు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 33 కేసులు, కరీంనగర్ జిల్లాలో 31 కేసులు, నల్గొండ జిల్లాలో 28 కేసులు గుర్తించారు.
అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 581 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ఊరటనిచ్చే మరో అంశం ఏంటంటే.. కొత్తగా కొవిడ్ మరణాలేవీ సంభవించలేదు.
రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 20వేల 617 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 10వేల 773 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 5వేల 773గా ఉంది. రాష్ట్రంలో నేటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4వేల 111. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సోమవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు రాష్ట్రంలో 32వేల 834 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 705 మందికి పాజిటివ్ గా తేలింది.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







