‘కార్తికేయ 2’పై నిఖిల్ ధీమా: కారణమేంటంటే.!
- August 02, 2022
నిఖిల్ సిద్దార్ధ్ నటించిన ‘కార్తికేయ 2’ ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. సూపర్ నేచురల్ పవర్స్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాపై పాజిటివ్ బజ్ బాగానే వుంది. కానీ, ఇదే రోజు నితిన్ నటిస్తున్న ‘మాచర్ల నియోజక వర్గం’ సినిమా రిలీజ్ కాబోతోంది.
ఈ సినిమా పక్కా మాస్ మూవీ. నితిన్ మాస్ రోల్లో భీభత్సమైన యాక్షన్ ఎపిసోడ్స్, మాస్ పల్స్ వున్న డైలాగులతో రెచ్చిపోతున్నాడు. నితిన్ మాస్ ముందు క్లాస్గా నిఖిల్ తట్టుకోగలడా.? అంటే, ఈ రెండూ డిఫరెంట్ జోనర్ మూవీస్.
ఈ మధ్య సూపర్ నేచురల్ పవర్ సినిమాలు పెద్దగా తెరకెక్కడం లేదు. అందులోనూ, ‘కార్తికేయ’తో ఆల్రెడీ హిట్టు కొట్టిన నిఖిల్, దానికి సీక్వెల్గా రూపొందుతోన్న ఈ సినిమాకి, తొలి పార్ట్కి కొనసాగింపుగా అనేక ఆసక్తికరమైన అంశాలు వుండబోతున్నాయని చెబుతున్నాడు.
అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో, తొలి పార్ట్ హీరోయిన్ స్వాతి కూడా ఓ ఇంపార్టెంట్ రోల్లో కనిపించబోతోందని నిఖిల్ క్లారిటీ అయితే ఇచ్చాడు కానీ, ఆ పాత్ర ఏంటనేది మాత్రం రివీల్ చేయలేదు.
లొకేషన్లు, గ్రాఫిక్స్.. ఇలా అన్నీ‘కార్తికేయ 2’లో సరికొత్త అనుభూతినిస్తాయని, ఖచ్చితంగా ధియేటర్కి వచ్చిన ప్రేక్షకులు టిక్కెట్ వసూల్ ఫీల్ పొందుతారనీ అంటున్నాడు నిఖిల్. మరి, నిఖిల్ చెప్పినట్లుగా ‘రెండో కార్తికేయుడు’ అంచనాల్ని అందుకుంటాడా అనేది తెలియాలంటే, ఆగస్ట్ 12 వరకూ వేచి చూడాల్సిందే.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







