మిల్కీ ‘గుర్తుందా శీతాకాలం’: మర్చిపోయేలా వున్నారుగా.!
- August 02, 2022
మిల్కీ బ్యూటీ తమన్నానటించిన ‘గుర్తుందా శీతాకాలం’ సినిమా ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకుంది. కానీ, ఇంతవరకూ రిలీజ్కి నోచుకోలేదు. జూలైలోనే ఈ సినిమా రిలీజ్ కావల్సి వుంది. కానీ, అనూహ్య కారణాల వల్ల సినిమా రిలీజ్ ఆగిపోయింది.
ఆగస్ట్లో రిలీజ్ అవుతుందనుకున్నారు. కానీ, ఆగస్టులోనూ అనౌన్స్మెంట్ జరిగలేదు. ఇదిలాగే కొనసాగితే, ‘గుర్తుందా శీతాకాలం’.. అని టైటిల్లో వుంది కానీ, ఎన్ని శీతాకాలాలు వెళ్లిపోతాయో.. ఈ లోపు జనమే మర్చిపోయే ప్రమాదముంది. సత్యరాజ్ హీరోగా నటించిన ఈ సినిమాకి నాగ శేఖర్ దర్శకత్వం వహించారు.
కాగా, గతంలోనూ మిల్కీ బ్యూటీ తమన్నా నటించిన ‘దటీజ్ మహాలక్ష్మి’ అనే సినిమా పరిస్థితి ఇలాగే అయ్యింది. ఇప్పటి వరకూ ఆ సినిమా స్టేటస్ ఏంటనేదీ తెలీదు.
ఇదిలా వుంటే, తమన్నా మాత్రం కొత్త ప్రాజెక్టులు వరుసగా చేసుకుంటూ పోతోంది. రీసెంట్గా ‘ఎఫ్ 3’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించింది. మెగాస్టార్ చిరంజీవితో ‘భోళా శంకర్’ సినిమాలో నటిస్తోంది.
అలాగే, మూడు హిందీ ప్రాజెక్టులు తమన్నా చేతిలో వున్నాయ్. ఒక తమిళ సినిమాలోనూ మిల్కీ బ్యూటీ సందడి చేస్తోంది.
తాజా వార్తలు
- లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడి..10 మంది మృతి
- ఇల్లు కట్టుకునే వారికి శుభవార్త తెలిపిన తెలంగాణ ప్రభుత్వం
- డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీల జారీలో కీలక మార్పు
- అజ్మాన్ కొత్త మాస్టర్ ప్లాన్: ఇక ట్రాఫిక్ కష్టాలకు చెక్..
- CBSE 10వ తరగతి కొత్త నిబంధనలు: మొదటి బోర్డు పరీక్ష తప్పనిసరి..
- రమదాన్ ఇ-భిక్షాటనకు AI వినియోగం..హెచ్చరిక జారీ..!!
- యుద్ధం ముంచుకొస్తోందా? ఇరాన్ చుట్టూ పెరుగుతున్న ఉద్రిక్తతలు
- గాజాకు 100 టన్నుల అత్యవసర సహాయం ఎయిర్ లిఫ్ట్..!!
- వీకెండ్ లో పొగమంచు.. పగలు వేడి, రాత్రిళ్లు కూల్..!!
- ఒమన్ లో ఈద్ అల్ ఫితర్ సెలవులు ఎన్ని రోజులు?









