మిల్కీ ‘గుర్తుందా శీతాకాలం’: మర్చిపోయేలా వున్నారుగా.!
- August 02, 2022
మిల్కీ బ్యూటీ తమన్నానటించిన ‘గుర్తుందా శీతాకాలం’ సినిమా ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకుంది. కానీ, ఇంతవరకూ రిలీజ్కి నోచుకోలేదు. జూలైలోనే ఈ సినిమా రిలీజ్ కావల్సి వుంది. కానీ, అనూహ్య కారణాల వల్ల సినిమా రిలీజ్ ఆగిపోయింది.
ఆగస్ట్లో రిలీజ్ అవుతుందనుకున్నారు. కానీ, ఆగస్టులోనూ అనౌన్స్మెంట్ జరిగలేదు. ఇదిలాగే కొనసాగితే, ‘గుర్తుందా శీతాకాలం’.. అని టైటిల్లో వుంది కానీ, ఎన్ని శీతాకాలాలు వెళ్లిపోతాయో.. ఈ లోపు జనమే మర్చిపోయే ప్రమాదముంది. సత్యరాజ్ హీరోగా నటించిన ఈ సినిమాకి నాగ శేఖర్ దర్శకత్వం వహించారు.
కాగా, గతంలోనూ మిల్కీ బ్యూటీ తమన్నా నటించిన ‘దటీజ్ మహాలక్ష్మి’ అనే సినిమా పరిస్థితి ఇలాగే అయ్యింది. ఇప్పటి వరకూ ఆ సినిమా స్టేటస్ ఏంటనేదీ తెలీదు.
ఇదిలా వుంటే, తమన్నా మాత్రం కొత్త ప్రాజెక్టులు వరుసగా చేసుకుంటూ పోతోంది. రీసెంట్గా ‘ఎఫ్ 3’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించింది. మెగాస్టార్ చిరంజీవితో ‘భోళా శంకర్’ సినిమాలో నటిస్తోంది.
అలాగే, మూడు హిందీ ప్రాజెక్టులు తమన్నా చేతిలో వున్నాయ్. ఒక తమిళ సినిమాలోనూ మిల్కీ బ్యూటీ సందడి చేస్తోంది.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







