మిల్కీ ‘గుర్తుందా శీతాకాలం’: మర్చిపోయేలా వున్నారుగా.!
- August 02, 2022
మిల్కీ బ్యూటీ తమన్నానటించిన ‘గుర్తుందా శీతాకాలం’ సినిమా ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకుంది. కానీ, ఇంతవరకూ రిలీజ్కి నోచుకోలేదు. జూలైలోనే ఈ సినిమా రిలీజ్ కావల్సి వుంది. కానీ, అనూహ్య కారణాల వల్ల సినిమా రిలీజ్ ఆగిపోయింది.
ఆగస్ట్లో రిలీజ్ అవుతుందనుకున్నారు. కానీ, ఆగస్టులోనూ అనౌన్స్మెంట్ జరిగలేదు. ఇదిలాగే కొనసాగితే, ‘గుర్తుందా శీతాకాలం’.. అని టైటిల్లో వుంది కానీ, ఎన్ని శీతాకాలాలు వెళ్లిపోతాయో.. ఈ లోపు జనమే మర్చిపోయే ప్రమాదముంది. సత్యరాజ్ హీరోగా నటించిన ఈ సినిమాకి నాగ శేఖర్ దర్శకత్వం వహించారు.
కాగా, గతంలోనూ మిల్కీ బ్యూటీ తమన్నా నటించిన ‘దటీజ్ మహాలక్ష్మి’ అనే సినిమా పరిస్థితి ఇలాగే అయ్యింది. ఇప్పటి వరకూ ఆ సినిమా స్టేటస్ ఏంటనేదీ తెలీదు.
ఇదిలా వుంటే, తమన్నా మాత్రం కొత్త ప్రాజెక్టులు వరుసగా చేసుకుంటూ పోతోంది. రీసెంట్గా ‘ఎఫ్ 3’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించింది. మెగాస్టార్ చిరంజీవితో ‘భోళా శంకర్’ సినిమాలో నటిస్తోంది.
అలాగే, మూడు హిందీ ప్రాజెక్టులు తమన్నా చేతిలో వున్నాయ్. ఒక తమిళ సినిమాలోనూ మిల్కీ బ్యూటీ సందడి చేస్తోంది.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







