భారత్ కరోనా అప్డేట్
- August 05, 2022
న్యూ ఢిల్లీ: భారత్లో రోజువారీ కరోనా కేసుల సంఖ్య మళ్ళీ పెరుగుతోంది. దేశంలో తాజాగా 20,551 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, గత 24 గంటల్లో 21,595 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,35,364గా ఉందని చెప్పింది. రోజువారీ పాజిటివిటీ రేటు 5.14 శాతంగా ఉందని పేర్కొంది. వారాంతపు పాజిటివిటీ రేటు 4.64 శాతంగా ఉంది.
కరోనా రికవరీ రేటు ప్రస్తుతం 98.50 శాతంగా ఉందని తెలిపింది. ఇప్పటివరకు దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య మొత్తం 4,34,45,624గా ఉందని చెప్పింది. దేశంలో ఇప్పటివరకు 87.71 కోట్ల కరోనా పరీక్షలు చేశారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న 4,00,110 కరోనా పరీక్షలు చేశారని వివరించింది.
దేశంలో ఇప్పటివరకు మొత్తం 205.59 కరోనా వ్యాక్సిన్ డోసులు వేశామని తెలిపింది. వాటిలో రెండో డోసులు 93.46 కోట్లు, బూస్టర్ డోసులు 10.09 కోట్లు ఉన్నాయని పేర్కొంది. నిన్న దేశంలో 36,95,835 డోసుల వ్యాక్సిన్లు వేశారని వివరించింది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







