భారత్ కరోనా అప్డేట్
- August 05, 2022న్యూ ఢిల్లీ: భారత్లో రోజువారీ కరోనా కేసుల సంఖ్య మళ్ళీ పెరుగుతోంది. దేశంలో తాజాగా 20,551 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, గత 24 గంటల్లో 21,595 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,35,364గా ఉందని చెప్పింది. రోజువారీ పాజిటివిటీ రేటు 5.14 శాతంగా ఉందని పేర్కొంది. వారాంతపు పాజిటివిటీ రేటు 4.64 శాతంగా ఉంది.
కరోనా రికవరీ రేటు ప్రస్తుతం 98.50 శాతంగా ఉందని తెలిపింది. ఇప్పటివరకు దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య మొత్తం 4,34,45,624గా ఉందని చెప్పింది. దేశంలో ఇప్పటివరకు 87.71 కోట్ల కరోనా పరీక్షలు చేశారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న 4,00,110 కరోనా పరీక్షలు చేశారని వివరించింది.
దేశంలో ఇప్పటివరకు మొత్తం 205.59 కరోనా వ్యాక్సిన్ డోసులు వేశామని తెలిపింది. వాటిలో రెండో డోసులు 93.46 కోట్లు, బూస్టర్ డోసులు 10.09 కోట్లు ఉన్నాయని పేర్కొంది. నిన్న దేశంలో 36,95,835 డోసుల వ్యాక్సిన్లు వేశారని వివరించింది.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి