థాయ్లాండ్ క్లబ్లో భారీ అగ్ని ప్రమాదం.. 13 మంది సజీవదహనం
- August 05, 2022
థాయ్లాండ్: థాయ్లాండ్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రాజధాని బ్యాంక్ కు ఆగ్నేయంగా ఉన్న చోన్ బురి ప్రావిన్స్ లోని నైట్ క్లబ్ లో శుక్రవారం జరిగిన అగ్నిప్రమాదంలో 13 మంది సజీవ దహనమయ్యారు. మరో 40 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సత్తాహిప్ జిల్లాలోని మౌంటైన్ బి నైట్ క్లబ్ లో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మరణించినవారందరూ థాయ్ జాతీయులని అక్కడి పోలీసులు తెలిపారు.
శుక్రవారం ఉదయం 2గంటల ప్రాంతంలో క్లబ్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా క్లబ్ మొత్తం వ్యాపించడంతో మంటల్లో చిక్కుకొని 13 మంది మరణించారు. వీరిలో నలుగురు మహిళలు, తొమ్మిది మంది పురుషులు ఉన్నారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మంటలు ఆర్పేందుకు మూడు గంటల పాటు కష్టపడ్డారు. అప్పటికే నైట్ క్లబ్ అధికభాగం కాలిపోయింది.
క్లబ్లో మంటలు వ్యాపించగానే స్థానికులు పరుగులు పెట్టారు. కొందరు శరీరానికి మంటలు అంటుకోవటంతో మంటలతోనే పరుగులు పెట్టారు. అగ్ని ప్రమాదానికి ప్రధాన కారణం క్లబ్ లోని గోడలకు రసాయనాల వల్లేనని తెలిసింది. వాటివల్ల మంటలను అదుపు చేయడానికి చాలా సమయం పట్టిందని అధికారులు అన్నారు. మంటల్లో చిక్కుకొని సుమారు 40 మందికిపైగా గాయపడ్డారు. వీరిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.
అయితే చికిత్సపొందుతున్న వారిలో 20మందికిపైగా పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఘటనకు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.
తాజా వార్తలు
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!







