కాగితాన్ని కరెన్సీగా మారుస్తానన్న మోసగాడు అరెస్ట్
- August 05, 2022
బహ్రెయిన్: కాగితాలను కరెన్సీ నోట్లకు మారుస్తానని నటిస్తూ బాధితులను మోసం చేసిన ఆఫ్రికన్ను యాంటీ ఎకనామిక్ క్రైమ్స్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసినట్లు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ యాంటీ కరప్షన్ అండ్ ఎకనామిక్ అండ్ ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ ప్రకటించింది. విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు చేసి నిందితుడిని అరెస్టు చేసినట్లు పేర్కొంది. నకిలీ కరెన్సీ తయారీకి వినియోగించే పరికరాలు, పనిముట్లు, రసాయనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్కు అప్పగించేందుకు చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇలాంటి మోసగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని, మోసాలపై సమాచారం తెలిస్తే హాట్లైన్ 992కు తెలపాలని జనరల్ డైరెక్టరేట్ ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







