కాగితాన్ని కరెన్సీగా మారుస్తానన్న మోసగాడు అరెస్ట్
- August 05, 2022
బహ్రెయిన్: కాగితాలను కరెన్సీ నోట్లకు మారుస్తానని నటిస్తూ బాధితులను మోసం చేసిన ఆఫ్రికన్ను యాంటీ ఎకనామిక్ క్రైమ్స్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసినట్లు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ యాంటీ కరప్షన్ అండ్ ఎకనామిక్ అండ్ ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ ప్రకటించింది. విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు చేసి నిందితుడిని అరెస్టు చేసినట్లు పేర్కొంది. నకిలీ కరెన్సీ తయారీకి వినియోగించే పరికరాలు, పనిముట్లు, రసాయనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్కు అప్పగించేందుకు చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇలాంటి మోసగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని, మోసాలపై సమాచారం తెలిస్తే హాట్లైన్ 992కు తెలపాలని జనరల్ డైరెక్టరేట్ ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్..
- తెలుగు రాష్ట్రాలకు వాతావరణ హెచ్చరిక.. 7 రోజుల పాటు భారీ వర్షాలు
- యూఏఈ ఎమిరేట్స్ ఐడితో ఫ్రాడ్ రిస్క్..డేటా ప్రొటెక్షన్ గైడ్..!!
- ఇరాన్ దురాక్రమణ పై యూఎన్ఓలో బహ్రెయిన్ ఫైర్..!!
- ఉత్తర అల్ షర్కియాలో భారీగా పొగాకు ఉత్పత్తులు స్వాధీనం..!!
- సౌదీలో లేబర్ తనిఖీలు.. 80వేల సౌదీకరణ ఉల్లంఘనలు..!!
- కువైట్ లో నలుగురు ప్రవాసులకు, పీఏసీఐ అధికారికి జైలు శిక్ష..!!
- ఖతార్లో మూడవ దశలోకి హాట్ సీజన్..!!
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు







