కాగితాన్ని కరెన్సీగా మారుస్తానన్న మోసగాడు అరెస్ట్
- August 05, 2022
బహ్రెయిన్: కాగితాలను కరెన్సీ నోట్లకు మారుస్తానని నటిస్తూ బాధితులను మోసం చేసిన ఆఫ్రికన్ను యాంటీ ఎకనామిక్ క్రైమ్స్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసినట్లు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ యాంటీ కరప్షన్ అండ్ ఎకనామిక్ అండ్ ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ ప్రకటించింది. విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు చేసి నిందితుడిని అరెస్టు చేసినట్లు పేర్కొంది. నకిలీ కరెన్సీ తయారీకి వినియోగించే పరికరాలు, పనిముట్లు, రసాయనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్కు అప్పగించేందుకు చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇలాంటి మోసగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని, మోసాలపై సమాచారం తెలిస్తే హాట్లైన్ 992కు తెలపాలని జనరల్ డైరెక్టరేట్ ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- విద్యాశాఖ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష
- Al Masaood Automobiles Powered Seamless Mobility at Open Masters Games Abu Dhabi 2026
- గూగుల్ మ్యాప్స్లో ఆధార్ కేంద్రాల వివరాలు
- కోల్కతా మెట్రోలో సరికొత్త బ్యాటరీ వ్యవస్థ
- డ్రైవింగ్ లైసెన్స్ విధానంలో మార్పులు..!
- శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ప్రారంభం
- జింబాబ్వే పై భారత్ ఘన విజయం
- భారత్-ఇజ్రాయెల్ మధ్య కీలక ఒప్పందాలు
- మళ్లీ తగ్గిన బంగారం ధర..పసిడి ప్రియులకు కాస్త ఊరట
- సౌదీ చమురుయేతర ఎగుమతుల్లో 18.6% వృద్ధి..!!









