‘సీతారామం’ ప్రమోషన్లలో రష్మిక కనిపించలేదెందుకంటే.!
- August 06, 2022
నేషనల్ క్రష్ అనే ఇమేజ్ దక్కించుకున్న రష్మికా మండన్నా ఆ క్రేజ్ని బాగా యూజ్ చేసుకుంటోంది. తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తూనే బాలీవుడ్ సినిమాలతో బిజీగా గడిపేస్తోంది.
ముఖ్యంగా రష్మిక చేతిలో మూడు బాలీవుడ్ బిగ్ ప్రాజెక్టులున్నాయ్. మూడూ ప్రెస్టీజియస్ ప్రాజెక్టులే. కెరీర్ మొదట్లోనే ఇంత భారీ ప్రాజెక్టులు పట్టేయడం అన్నది అంత ఆషా మాషీ విషయం కాదు.
దీపమున్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి.. అనే నానుడికి రష్మిక బాగా వాడేసుకుంటోంది. కొందరు ముద్దుగుమ్మలు సౌత్ సినిమాలతో బిజీగా వున్నప్పుడు, బాలీవుడ్పై దృష్టి పెడితే, ఇక్కడ కెరీర్ నాశనమైపోతుంది అని భయపడుతుంటారు. కానీ, రష్మిక అలా కాదు, డేరింగ్ స్టెప్ వేసింది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనిపించుకుంటూనే, బాలీవుడ్లో ఫుల్ ఫోకస్ పెట్టేసింది. రణ్బీర్ కపూర్తో ‘యానిమల్’ అనే సినిమాలో నటిస్తోంది రష్మిక. అలాగే, బిగ్ బి అమితాబ్ బచ్చన్తో ‘గుడ్బై’ సినిమాని ఆల్రెడీ పూర్తి చేసేసింది. దీంతో పాటూ, ‘మిషన్ మజ్ను’ సినిమానీ పూర్తి చేసేసింది. సిద్దార్ధ్ మల్హోత్రా ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.
వీటితో పాటూ మరిన్ని బాలీవుడ్ ప్రాజెక్టులు పట్టేసే పనిలో రష్మిక బిజీగా వుందట. ఇలా బాలీవుడ్లో బిజీ షెడ్యూల్స్తో వున్న కారణంగానే ‘సీతారామం’ సినిమాని తన స్టయిల్లో ప్రమోట్ చేయలేకపోయానని అంటోంది రష్మిక మండన్నా. ఆగస్టు 5న రిలీజ్ అయిన ఈ సినిమా అయినా కానీ, మంచి విజయం అందుకుంది. రష్మిక పాత్రకు నెక్స్ట్ లెవల్ గుర్తింపు దక్కింది.
తాజా వార్తలు
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం







