తెలంగాణ కరోనా అప్డేట్
- August 09, 2022హైదరాబాద్: తెలంగాణలో కరోనా రోజువారీ కేసుల సంఖ్య మరింత తగ్గింది.500లకు దిగువన కొత్త కేసులు నమోదయ్యాయి.గడిచిన 24 గంటల్లో 31వేల 629 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 494 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.హైదరాబాద్ లో 223, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 36, రంగారెడ్డి జిల్లాలో 34 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 1,054 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా కరోనా మరణాలేవీ నమోదు కాలేదు.
రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 31వేల 629 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 494 మందికి పాజిటివ్ గా తేలింది. అత్యధికంగా హైదరాబాద్ లో 223 కేసులు వచ్చాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 36 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 34 కేసులు గుర్తించారు.
అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 1054 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ఊరటనిచ్చే అంశం ఏంటంటే.. కొత్త కేసుల కన్నా రికవరీలే ఎక్కువ. ఇక రిలీఫ్ ఇచ్చే మరో అంశం కొత్తగా కొవిడ్ మరణాలేవీ సంభవించలేదు.
రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 26వేల 778 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 17వేల 560 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 5వేల 107కి తగ్గింది. రాష్ట్రంలో నేటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4వేల 111. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు రాష్ట్రంలో 24 గంటల్లో 33వేల 455 శాంపిల్స్ నిర్వహించగా.. 528 మందికి పాజిటివ్ గా తేలింది.
తాజా వార్తలు
- యూఏఈలో వడగళ్ల వాన..నివాసితుల ఆందోళన..!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు అల్ మక్తూమ్కు బదిలీ..!
- అబుధాబిలో పెరియర్ వాటర్ సురక్షితమా?
- సౌదీ ప్రతినిధి బృందంతో సుప్రీంకోర్టు ఛైర్మన్ సమావేశం
- సౌదీ సివిల్ సర్వెంట్స్ కు కొత్త డ్రెస్ కోడ్..!
- నర్సింగ్ సిబ్బందికి స్పెషల్ అలవెన్స్
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు