యూఏఈ-ఇండియా మధ్య నూతన డైరెక్ట్ ఫ్లయిట్ ప్రకటించిన ఇండిగో
- August 10, 2022
రాస్ అల్ ఖైమా: ముంబై-రాస్ అల్ ఖైమా మధ్య డైరెక్ట్ ఫ్లయిట్ ను ప్రముఖ భారత విమానయాన సంస్థ ఇండిగో ప్రకటించింది.ఆ సంస్థకు ఈ రూట్ 100 వ డెస్టినేషన్ కాబోతుంది.
ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత బలపడేందుకు ఈ నూతన డైరెక్ట్ విమాన రాకపోకలు దోహదపడతాయి . అంతేకాకుండా మాకు సంస్థకు రాస్ అల్ ఖైమా రూట్ 26వ అంతర్జాతీయ విమాన రూట్ కాగా మొత్తంగా 100 వ విమాన రూట్ చాలా సంతోషకరం అని ఇండిగో రెవెన్యూ అధికారి సంజయ్ కుమార్ తెలిపారు.
రాస్ అల్ ఖైమా అంతర్జాతీయ విమానాశ్రయం ఇండిగో విమానయాన సంస్థ తో భాగస్వామ్యం కావడం చాలా సంతోషకరం. భారత ఉపఖండం లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఈ నూతన డైరెక్ట్ విమానం చాలా బాగా ఉపయోగపడుతుందని రాస్ అల్ ఖైమా పౌర విమానయాన విభాగం ఛైర్మన్ షేక్ సలేం బిన్ సుల్తాన్ అల్ కష్మి తెలిపారు.
భారత ఉపఖండం లో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఇండిగో తో జరిగిన నూతన ఒప్పంద భాగస్వామ్యం చాలా దోహదపడుతుంది అని రాస్ అల్ ఖైమా అంతర్జాతీయ విమానాశ్రయం సీయివో అటనో సియోస్ టిత్నాయిస్ తెలిపారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







