కెమెరాలు అటు తిప్పండి ప్లీజ్.! ఫోటోగ్రాఫర్లతో వాగ్వాదానికి దిగిన తాప్సీ.!
- August 10, 2022
వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచే తాప్సీ, సరికొత్తగా ఓ కొత్త వివాదంలో ఇరుక్కుంది. ఓ ఈవెంట్కి సంబంధించి, తాప్సీ ఫోటోగ్రాఫర్లతో వాగ్వాదానికి దిగింది. ఫోటోలకు పోజులిచ్చేందుకు నిరాకరించింది. తాప్సీని ఫోటోలు తీసేందుకు అప్పటికే చాలా సమయం నుంచి వెయిట్ చేస్తున్న ఫోటోగ్రాఫర్లు తాప్సీ బిహేవియర్కి అసహనం వ్యక్తం చేశారు.
అయితే, ఈ ఇష్యూ పెద్దది కాకుండా, చాకచక్యంగా తాప్సీ తప్పించుకుంది. ఆమె తాజా చిత్రం ‘దొబారా’ ప్రమోషనల్ ఈవెంట్లో భాగంగా, ఈవెంట్కి లేటయిపోతుందంటూ, ఫోటోల కోసం ఇంకాస్త సమయం వెయిట్ చేయండి.. అంటూ ఫోటోగ్రాఫర్లను కోరుతూ, లోపలికి వెళ్లబోయింది.
కానీ, అప్పటికే విసిగిపోయిన ఫోటోగ్రాఫర్లలో ఒకరు తాప్సీని స్ర్టెయిట్గా ప్రశ్నించారు. గౌరవంగా మాట్లాడండి.. అంటూ తాప్సీ కూడా మౌత్ రైజ్ చేసింది. కానీ, చివరికి, ఈ వివాదం సద్దుమనిగిపోయింది.
ఇలాంటివి తాప్సీకి మామూలే కానీ, ఈ సారి కాస్త సంయమనమే పాఠించింది తాప్సీ. మొదట ఏం జరిగినా సెలబ్రిటీలనే తప్పు పడతారు. మీది ఏం తప్పు లేదు.. అంటూ మీడియాపై కస్సు బుస్సులాడుతూనే, తర్వాత చిరునవ్వులు చిందిస్తూ, వారితో సంధి కుదుర్చుకుంది. మీడియాతో పెట్టుకుంటే అంత వీజీ కాదుగా. ఆ మాత్రం తెలియనిది కాదు తాప్సీ. అందుకే కామ్ అయిపోయినట్లుంది.
ఇకపోతే, ఓ పక్క సినిమాల్లో నటిస్తూనే, ఈ మధ్య నిర్మాతగానూ మారింది తాప్సీ. తన నిర్మాణంలో సమంత హీరోయిన్గా తాప్సీ ఓ సినిమాని రూపొందిస్తున్నట్లు ఇటీవలే అధికారికంగా ప్రకటించింది.
తాజా వార్తలు
- కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధం..
- అభివృద్ధి పథాన కువైట్.. చారిత్రాత్మక సంస్కరణలతో మెరుగైన ఫలితాలు..
- మహాత్మాగాంధీ మెమోరియల్ ఆధ్వర్యంలో ఘనంగా అమెరికా స్వాతంత్ర్య 250వ వార్షికోత్సవ వేడుకలు
- యునెస్కో గుర్తింపు రేసులో బహ్రెయిన్ చారిత్రక గ్రామాలు..!!
- ఇద్దరు టెర్రరిస్టులు హతం
- వెనిజులాలో భూకంపాల బీభత్సం..మృతుల సంఖ్య 2,954కు పెరుగుదల
- NATS మేరీల్యాండ్ ఆన్లైన్ ఆర్ట్ వర్క్షాప్ కు మంచి స్పందన
- రోడ్డు మధ్యలో వాహనాలు ఆపొద్దు..ప్రమాదాల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- బోయింగ్ 777 విమానాల విక్రయం.. ఆరోపణలను ఖండించిన సౌదియా ..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే' డ్రా..Dh100,000 గెలిచిన విజేత..!!







