కెమెరాలు అటు తిప్పండి ప్లీజ్.! ఫోటోగ్రాఫర్లతో వాగ్వాదానికి దిగిన తాప్సీ.!
- August 10, 2022
వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచే తాప్సీ, సరికొత్తగా ఓ కొత్త వివాదంలో ఇరుక్కుంది. ఓ ఈవెంట్కి సంబంధించి, తాప్సీ ఫోటోగ్రాఫర్లతో వాగ్వాదానికి దిగింది. ఫోటోలకు పోజులిచ్చేందుకు నిరాకరించింది. తాప్సీని ఫోటోలు తీసేందుకు అప్పటికే చాలా సమయం నుంచి వెయిట్ చేస్తున్న ఫోటోగ్రాఫర్లు తాప్సీ బిహేవియర్కి అసహనం వ్యక్తం చేశారు.
అయితే, ఈ ఇష్యూ పెద్దది కాకుండా, చాకచక్యంగా తాప్సీ తప్పించుకుంది. ఆమె తాజా చిత్రం ‘దొబారా’ ప్రమోషనల్ ఈవెంట్లో భాగంగా, ఈవెంట్కి లేటయిపోతుందంటూ, ఫోటోల కోసం ఇంకాస్త సమయం వెయిట్ చేయండి.. అంటూ ఫోటోగ్రాఫర్లను కోరుతూ, లోపలికి వెళ్లబోయింది.
కానీ, అప్పటికే విసిగిపోయిన ఫోటోగ్రాఫర్లలో ఒకరు తాప్సీని స్ర్టెయిట్గా ప్రశ్నించారు. గౌరవంగా మాట్లాడండి.. అంటూ తాప్సీ కూడా మౌత్ రైజ్ చేసింది. కానీ, చివరికి, ఈ వివాదం సద్దుమనిగిపోయింది.
ఇలాంటివి తాప్సీకి మామూలే కానీ, ఈ సారి కాస్త సంయమనమే పాఠించింది తాప్సీ. మొదట ఏం జరిగినా సెలబ్రిటీలనే తప్పు పడతారు. మీది ఏం తప్పు లేదు.. అంటూ మీడియాపై కస్సు బుస్సులాడుతూనే, తర్వాత చిరునవ్వులు చిందిస్తూ, వారితో సంధి కుదుర్చుకుంది. మీడియాతో పెట్టుకుంటే అంత వీజీ కాదుగా. ఆ మాత్రం తెలియనిది కాదు తాప్సీ. అందుకే కామ్ అయిపోయినట్లుంది.
ఇకపోతే, ఓ పక్క సినిమాల్లో నటిస్తూనే, ఈ మధ్య నిర్మాతగానూ మారింది తాప్సీ. తన నిర్మాణంలో సమంత హీరోయిన్గా తాప్సీ ఓ సినిమాని రూపొందిస్తున్నట్లు ఇటీవలే అధికారికంగా ప్రకటించింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







