'హర్ ఘర్ తిరంగా' కోసం 20 కోట్ల జాతీయ జెండాలు సిద్ధం
- August 13, 2022
న్యూఢిల్లీ: దేశమంతా 75వ స్వాతంత్ర వేడుకల్ని ఘనంగా నిర్వహించుకుంటున్న సంగతి తెలిసిందే. గతంలో ఒక్క రోజు మాత్రమే జరిగే వేడుకలు ఈ సారి రెండు, మూడు వారాలపాటు సాగనున్నాయి.
దేశవ్యాప్తంగా ఈ నెల 2నుంచి సంబరాలు మొదలయ్యాయి. మరోవైపు 'హర్ ఘర్ తిరంగా' కార్యక్రమం కూడా విజయవంతంగా సాగుతోంది.
దీనిలో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురుతోంది. అందులోనూ ఈ నెల 13, 14, 15 తేదీల్లో వరుసగా మూడు రోజులు జాతీయ జెండా ఎగురుతుంది. దీంతో దేశవ్యాప్తంగా గతంలో ఎప్పుడూ లేనంతగా జాతీయ జెండాలకు డిమాండ్ పెరిగింది. కేంద్ర సాంస్కృతిక శాఖ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశంలో ఇప్పటివరకు 20 కోట్లకు పైగా జాతీయ జెండాలు సిద్ధమయ్యాయి. 'హర్ ఘర్ తిరంగా' కార్యక్రమం గురించి ప్రధాని ప్రకటించిన తర్వాతి నుంచి ఈ జెండాలు సిద్ధమయ్యాయని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమం కోసం జెండా కోడ్లో మార్పులు తెస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది. దీంతో ప్రతి ఒక్కరూ జెండాను తమ ఇంటిపై ఎగరేసేందుకు ఆసక్తి చూపుతున్నారని అధికారులు అంటున్నారు.
దీని ప్రకారం పగటిపూటే కాకుండా, రాత్రిపూట కూడా జాతీయ జెండాలు ఇంటిపై ఎగరేయొచ్చు. కేంద్ర ప్రచారంలో భాగంగా జెండా ఎగరవేసిన తర్వాత సెల్ఫీ తీసుకుని, సోషల్ మీడియాలో షేర్ చేయాలని సూచించింది. అలాగే సోషల్ మీడియా అకౌంట్లలో డీపీగా జాతీయ పతాకాన్ని ఉంచుకోవాలని సూచించింది.
తాజా వార్తలు
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..







