కాంగ్రెస్కు మరో షాక్..
- August 17, 2022
న్యూ ఢిల్లీ: జమ్మూ కశ్మీర్ రాష్ట్ర కాంగ్రెస్ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ పదవికి సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ రాజీనామా చేసిన కొద్ది సమయానికే మరో ముగ్గురు కశ్మీర్ నేతలు జమ్మూ కశ్మీర్ రాష్ట్ర కాంగ్రెస్ క్యాంపెయిన్ కమిటీకి రాజీనామా చేశారు. ఇందులో ఒకరు సోపోర్ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన హజి అబ్దుల్ రషిద్ కాగా మరో ఇద్దరు మహ్మద్ భట్, గుల్జర్ అహ్మద్ వని. ఇంత తక్కువ వ్యవధిలో నలుగురు కీలక నేతలు పార్టీ వీడడంతో ఇప్పటికే కశ్మీర్లో అంతంతగానే ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఇది పెద్ద ఎదురు దెబ్బని అంటున్నారు.
జమ్మూ కశ్మీర్ కాంగ్రెస్ క్యాంపెయిన్ కమిటీని బుధవారమే ప్రకటించారు. ఇందులో పలువురికి చోటు ఇవ్వగా గులాం నబీ ఆజాద్ను ఆ కమిటీకి చెర్మన్గా నియమించారు. అయితే ఈ నిమాయకం జరిగిన గంటల వ్యవధిలోనే ఆయన రాజీనామా చేయడం విశేషం. అలాగే జమ్మూ కశ్మీర్లోని రాజకీయ వ్యవహాలర కమిటీ సభ్యుడిగా కూడా ఉన్న ఈయన.. ఆ పదవికి కూడా రాజీనామా చేశారు.
కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతల్లో ఒకరైన ఆజాద్.. చాలా కాలంగా కాంగ్రెస్ అదిష్టానం తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.రాజ్యసభ పదవీ కాలాన్ని పొడగించకపోవడంతో పాటు బీజేపీ హిందుత్వ రాజకీయాల మూలంగా తనను పార్టీలో సైతం పక్కన పెట్టారనే అసంతృప్తి ఆయనకు ఉన్నట్లు తెలుస్తోంది. కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలకు చాలా దూరంగా ఉంటూ తన అసంతృప్తిని తెలియజేస్తూనే వస్తున్నారు. ఈ తరుణంలో చాలా కాలం తర్వాత పార్టీ ఆయనకు పదవులు అప్పగించినప్పటికీ తన ఈసారి తన అసంతృప్తిని రాజీనామా ద్వారా తెలియజేయడం విశేషం.
తాజా వార్తలు
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..
- 'బెల్ ఆఫ్ ఆర్మ్స్', 'సారథి' సెంట్రల్ వర్క్షాప్ను ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- మా కృషి వల్లే జిందాల్ స్టీల్ నిర్మాణం: జగన్
- షార్జా ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల కాన్సులర్ అటెస్టేషన్ సేవలు
- గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన పవన్ కల్యాణ్
- దేశంలోనే తొలిసారి.. విమానాన్ని వేలం వేసిన ED..
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!







