ఇంటికి నిప్పంటించిన వ్యక్తికి మూడేళ్ల జైలు శిక్ష
- August 21, 2022
బహ్రెయిన్: తాను నివసిస్తున్న అపార్ట్మెంట్ను ఉద్దేశపూర్వకంగా నిప్పు పెట్టిన 30 ఏళ్ల వ్యక్తికి మూడేళ్ల జైలు శిక్ష పడింది. హై క్రిమినల్ కోర్టులో జరిగిన విచారణలో వ్యక్తి నేరానికి పాల్పడినట్లు నిర్ధారించారు. అపార్ట్మెంట్కు నిప్పంటించినందుకు సదరు వ్యక్తిని కోర్టు దోషిగా తేల్చింది. తను ఉంటున్న అపార్టుమెంట్ ను తగులబెట్టి అదే భవనంలో నివసిస్తున్న ఇతరుల జీవితాలకు ప్రమాదం కలిగించాడని కోర్టు ఆక్షేపించింది. సంఘటన జరిగిన సమయంలో నిందితుడు డ్రగ్స్ మత్తులో ఉన్నాడని వైద్య పరీక్షలో తేలిందని, సిగరేట్ తాగుతూ ఉద్దేశపూర్వకంగానే అపార్ట్మెంట్కు నిప్పు పెట్టాడని తమ విచారణలో తేలిందని పోలీసులు కోర్టుకు తెలిపారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ అతనిపై ఉద్దేశపూర్వకంగా నిప్పుపెట్టడం, ఇతరుల ప్రాణాలకు హాని కలిగించినట్లు అభియోగాలు మోపింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







