వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్ 2022.. మూడో స్థానంలో సౌదీ
- August 21, 2022
రియాద్: అంతర్జాతీయ వలసదారులకు సౌదీ అరేబియా మూడవ అగ్ర గమ్యస్థానంగా ఉంది. యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (IOM) విడుదల చేసిన వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్ 2022 ప్రకారం.. సౌదీలో 13.5 మిలియన్ల ప్రవాసులు ఉన్నారు. 1970 నుండి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంతర్జాతీయ వలసదారులకు ప్రధాన గమ్యస్థానంగా ఉందని నివేదిక చూపించింది. 1970లో 12 మిలియన్లు ఉన్న వలసదారుల సంఖ్య 2019 నాటికి 50.6 మిలియన్లకు చేరుకుందని తెలిపింది. ఇక రెండవ స్థానంలో ఉన్న జర్మనీలో 2000లో 8.9 మిలియన్ల వలసదారులు ఉండగా.. 2020 నాటికి దాదాపు 16 మిలియన్లకు పెరిగిందని నివేదిక పేర్కొంది. సౌదీ అరేబియా తర్వాత స్థానాల్లో రష్యా, యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కెనడా ఉన్నాయి. 2030 నాటికి సౌదీ అరేబియా రాజ్య జనాభా 50 మిలియన్లకు చేరుకుంటుందని, అందులో 25 మిలియన్ల ప్రవాసులు ఉంటారని క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ గతంలో తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







