కువైట్ విమానాశ్రయానికి భారీగా పెరిగిన ప్రయాణికుల తాకిడి..
- August 21, 2022
కువైట్ సిటీ: వేసవి సెలవులు ముగియడంతో పాటు విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో విహారయాత్రలకు, స్వదేశానికి వెళ్లిన ప్రవాసులు తిరిగి కువైట్ చేరుకుంటున్నారు.దీంతో గడిచిన రెండు రోజులుగా కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రయాణికుల తాకిడి భారీగా పెరిగింది.ఈ రెండు రోజుల్లో బయటి దేశాల నుంచి కువైట్ ఎవిమానాశ్రయానికి ఏకంగా 340కి పైగా విమానాలు వచ్చినట్లు విమానాశ్రయ అధికారులు వెల్లడించారు.ఇందులో ఈజిప్ట్, సౌదీ అరేబియా, టర్కీ, దుబాయ్ నుంచి అధిక సంఖ్యలో విమానాలు విమానాశ్రయానికి చేరుకున్నట్లు తెలిపారు.ఇలా రోజుకు కనీసం 25వేల నుంచి 30వేల వరకు ప్రయాణికులు ఇతర దేశాల నుంచి కువైట్ ఎయిర్పోర్టుకు వచ్చారని అధికారులు పేర్కొన్నారు.రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







