శ్రీవారి భక్తులకు శుభవార్త..
- August 24, 2022
తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా అందుబాటులోకి వచ్చాయి. అక్టోబర్ నెలకు సంబంధించి టికెట్ల కోటాను బుధవారం టీటీడీ విడుదల చేసింది. అయితే అక్టోబర్ నెలకు సంబంధించి మరికొన్ని ఆర్జిత సేవా టికెట్లను మధ్యాహ్నం 2గంటలకు లక్కీ డీప్ ద్వారా కేటాయించనున్నారు. వీటితో పాటు అక్టోబర్ నెల కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ తదితర వర్చువల్ సేవల దర్శన కోటా టికెట్లను కూడా సాయంత్రం 4గంటలకు ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచనున్నారు.
ఇదిలా ఉంటే ఆర్జిత సేవ కోసం మొత్తం 54వేల టికెట్లు ఆన్ లైన్ లో టీటీడీ అందుబాటులో ఉంచింది.ఆన్లైన్లో శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను బుక్ చేసుకోవాలంటే అధికారిక వెబ్ సైట్ https://ttdsevaonline.comలో సందర్శించి బుక్ చేసుకోవచ్చునని టీటీడీ తెలిపింది. ఇదిలాఉంటే తిరుమల తిరుపతిలో భక్తుల రద్దీ కొనసాగుతుంది.
మంగళవారం తిరుమల శ్రీవారిని 68,467 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.67కోట్లు వచ్చినట్లు టీటీడీ ప్రకటించింది. ఇదిలాఉంటే గత ఐదు నెలలుగా రూ. 100కోట్ల మార్కును శ్రీవారి హుండీ ఆదాయం దాటుతోంది. ఆగస్టు నెలలో ఇప్పటికే శ్రీవారి హుండీ ఆదాయం రూ. 100కోట్ల మార్కును దాటేయగా.. ఈ నెలలో రూ. 140కోట్లకు చేరే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







