షేక్ మొహమ్మద్ పాలనకు 101 రోజులు
- August 25, 2022
యూఏఈ: షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టి 101 రోజులు పూర్తయిన సందర్భంగా ఉప ప్రధాన మంత్రి, అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ సైఫ్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ అభినందనలు తెలిపారు. ఫెడరల్ సుప్రీం కౌన్సిల్ మే 14న యూఏఈ మూడవ అధ్యక్షుడిగా షేక్ మొహమ్మద్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న విషయం తెలినిందే. మే 13న 73వ ఏట మరణించిన తన సోదరుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తర్వాత అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. జూలై 2022లో షేక్ మొహమ్మద్ తక్కువ-ఆదాయ పౌరుల కోసం సామాజిక మద్దతు కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన బడ్జెట్ను Dh14 బిలియన్ నుండి Dh28 బిలియన్లకు పెంచారు. ఈ ఫండ్ ద్వారా గృహనిర్మాణం, విశ్వవిద్యాలయ విద్య, 45 ఏళ్లు పైబడిన నిరుద్యోగ పౌరులకు కొత్త పథకాలను రూపకల్పన చేశారు. అలాగే ఇంధనం, ఆహారం, నీరు, విద్యుత్తు కోసం సబ్సిడీలను కూడా ప్రవేశపెట్టింది. దేశవ్యాప్తంగా పరిమిత ఆదాయం ఉన్న పౌరులకు మంచి జీవనోపాధిని కల్పించాలనే ఉద్దేశించి అలవెన్సులను ప్రకటించారని షేక్ సైఫ్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తన అభినందన సందేశంలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







