కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం..
- August 25, 2022కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తుమకూరు జిల్లాలోని శిరా తాలూకా బాలినహళ్లిలో లారీ, జీపు ఢీ కొన్నాయి.ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందగా, మరో 12 మంది తీవ్రగాయాలయ్యాయి. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడినవారిని తుమకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు వారికి చికిత్స అందిస్తున్నారు. గత అర్ధరాత్రి సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదానికి అతి వేగమే కారణమని తెలుస్తోంది. మృతులంతా రాయచూరు జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారని అధికారులు చెప్పారు. ప్రమాద సమయంలో క్రూయిజర్ జీపులో 20 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది.
తాజా వార్తలు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా
- అరబ్ సమ్మిట్. గాజా సంక్షోభం, పాలస్తీనా గుర్తింపుపై ఫోకస్..!
- PACI సందర్శకులకు శుభవార్త..!
- ఒమన్ పీస్ బిల్డర్.. UN సెక్రటరీ జనరల్ ప్రశంసలు
- అనుమతి లేకుండా హజ్.. SR100,000 వరకు ఫైన్..!
- 'దుబాయ్ అన్లాక్డ్' క్లెయిమ్లను కొట్టిపారేసిన యూఏఈ..!
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్లైన్స్
- స్పామ్ కాల్స్కు ఇక గుడ్బై..