పాఠశాలల్లో శీతల పానీయాలను నిషేధించిన సౌదీ అరేబియా
- August 28, 2022
రియాద్: ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్దేశించిన ప్రమాణాలను ఉల్లంఘించినందున పాఠశాలల్లోకి శీతల పానీయాలను అనుమతించడం లేదని విద్యా మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇబ్తేసామ్ అల్-షెహ్రీ ధృవీకరించారు.
పాఠశాల క్యాంటీన్లలో విద్యార్థులకు అందించే వాటిపై నిఘా ఉంచాలని అన్ని దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల విద్యాశాఖలను మంత్రిత్వ శాఖ డిమాండ్ చేసింది.
శీతల పానీయాలను విక్రయించకూడదనే వారి నిబద్ధతను మరియు పాఠశాలలో అనుమతించబడిన ఆహార ఎంపికలను విక్రయించడంలో వారి తనిఖీలు చేయడాన్ని విద్యా మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తుందని ఆమె నొక్కి చెప్పారు.
నాణ్యమైన ఆహార సేవలను అందించేందుకు ప్రైవేట్ రంగానికి తలుపులు తెరవాలని మంత్రిత్వ శాఖ విద్యా శాఖలను ఆదేశించిందని ప్రతినిధి తెలిపారు.
విద్యార్థుల కోసం అందించబడే మొత్తం సేవలను పూర్తి చేయడం, పాఠ్యాంశాలను ముద్రించి పాఠశాలలకు పంపిణీ చేయడం వంటి అన్ని రంగాలలో వారి సంసిద్ధతను ఆమె ధృవీకరించారు.
విద్యార్థుల్లో వృత్తి మరియు జీవన నైపుణ్యాలను పెంచేలా సుదీర్ఘ ప్రణాళికను సిద్ధం చేయడం జరిగిందని అందుకు సంబంధించిన కార్యాచరణ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.
విద్యార్థులు పాఠశాలలకు రవాణా విషయానికొస్తే, నూర్ సిస్టమ్ ద్వారా రవాణా కోసం తల్లిదండ్రులు తమ పిల్లలను నమోదు చేసుకోవడానికి మంత్రిత్వ శాఖ కొనసాగుతుందని ప్రతినిధి తెలిపారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







