సరిహద్దు అంశం పైనే భారత్-చైనా సంబంధాలు ఆధారపడి ఉంటాయి: విదేశాంగ మంత్రి జైశంకర్
- August 30, 2022
న్యూఢిల్లీ: భారత్-చైనా సరిహద్దులో ఉన్న పరిస్థితి ఆధారంగానే, ఇరు దేశాల మధ్య సంబంధాలు ఆధారపడి ఉంటాయన్నారు భారత విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి జైశంకర్.
న్యూఢిల్లీలో ఏర్పాటైన ఆసియా సొసైటీ పాలసీ ఇన్స్టిట్యూట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా భారత్-చైనా సంబంధాలపై మాట్లాడారు. ''భారత్-చైనా దేశాల మధ్య సరిహద్దులో ఉన్న పరిస్థితిని బట్టే, ఇరు దేశాల సంబంధాలు ఆధారపడి ఉంటాయి. గతంలోలాగా రెండు దేశాల మధ్య సానుకూలత, స్థిరత్వం ఏర్పడాలంటే మూడు అంశాల్ని పరిగణనలోకి తీసుకోవాలి. 'పరస్పర సున్నితత్వం, పరస్పర గౌరవం, పరస్పర ఆసక్తు'ల మీదే సంబంధాలు ఆధారపడి ఉంటాయి. ప్రస్తుతం రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాల గురించి అందరికీ తెలిసిందే'' అని జై శంకర్ వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో భారత్-చైనా సంబంధాల మీదే ఆసియా అభివృద్ధి ఆధారపడి ఉంటుందన్నారు.
అభివృద్ధిలో ప్రస్తుత ట్రెండ్ కొనసాగుతుందని భావిస్తున్నట్లు జై శంకర్ చెప్పారు. ఇదే కార్యక్రమంలో ఆస్ట్రేలియా మాజీ ప్రధాని కెవిన్ రడ్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..
- 'బెల్ ఆఫ్ ఆర్మ్స్', 'సారథి' సెంట్రల్ వర్క్షాప్ను ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- మా కృషి వల్లే జిందాల్ స్టీల్ నిర్మాణం: జగన్
- షార్జా ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల కాన్సులర్ అటెస్టేషన్ సేవలు
- గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన పవన్ కల్యాణ్
- దేశంలోనే తొలిసారి.. విమానాన్ని వేలం వేసిన ED..
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!







