కరణ్ షోలో కృతిసనన్ బోల్డ్ వ్యాఖ్యలు: అందుకే ఆ రోల్ చేయలేదన్న కృతిసనన్
- September 03, 2022
బాలీవుడ్ ప్రముఖ ఫిలిం మేకర్ కరణ్ జోహార్ హోస్ట్గా వ్యవహరిస్తున్న ‘కాఫీ విత్ కరణ్’ షోలో సెలబ్రిటీల నుంచి బోల్డ్ సమాధానాలు రప్పించడం పరిపాటి. అందుకే కరణ్ జోహార్ షోకి అంత క్రేజ్. అయితే, కొంతమంది సెలబ్రిటీలు ఈ షోకి రావడానికి కూసింత భయపడుతుంటారు కూడా.
తాజాగా కృతిసనన్ ఈ షోలో పార్టిసిపేట్ చేసింది. ఈ సందర్భంగా ఆమె తన పర్సనల్ విషయాలను చాలా పంచుకుంది. ‘లస్ట్ స్టోరీస్’ అను ఓ అడల్ట్ వెబ్ సిరీస్ గురించి తెలిసిందే. ఆ వెబ్ సిరీస్తోనే కియారా అద్వానీ పాపులర్ అయ్యింది. స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది.
అయితే, మొదట్లో ఆ పాత్ర కృతి సనన్ దగ్గరకొచ్చిందట. కానీ, ఆ పాత్రలోని బోల్డ్నెస్ కారణంగా కృతి ఆ ఛాన్స్ మిస్ చేసుకుందట. శృంగార సమస్యతో బాధపడుతున్న ఓ మహిళ వైబ్రేటర్ ద్వారా ఆ తృప్తిని పొందుతుంది. ఆ సన్నివేశం చాలా జుగుప్స కలిగిస్తుంది. కేవలం ఆ సన్నివేశం కారణంగానే కృతి సనన్ ఆ వెబ్ సిరీస్ని నో చెప్పిందట.
తాజాగా ఆ విషయం కరణ్ షో ద్వారా బయట పడింది. అయితేనేం, ప్రస్తుతం కృతిసనన్ కూడా బాలీవుడ్లో స్టార్డమ్ దక్కించుకుంది. పలు బిగ్ ప్రాజెక్టులతో కృతి సనన్ చాలా బిజీ అయిపోయింది. తెలుగులో ‘వన్ నేనొక్కడినే’ సినిమాతో డెబ్యూ చేసిన ఈ ముద్దుగుమ్మ లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు ప్రబాస్ సరసన ‘ఆదిపురుష్’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరిస్తోంది.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







