‘బ్రహ్మాస్త్ర’ మేనియా మొదలైంది
- September 03, 2022
రణ్బీర్ కపూర్, అలియా భట్ జంటగా తెరకెక్కుతోన్న ఫాంటసీ చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. హిందీతో పాటూ, తెలుగు తదితర భాషల్లో ఈ సినిమా రిలీజవుతోంది. తెలుగులో జక్కన్న రాజమౌళి ఈ సినిమాని సమర్పిస్తున్నారు.
కాగా ప్రస్తుతం బాలీవుడ్ సినిమా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. హిందీ సినిమాలనే తెలుగు సినిమాలుగా ప్రొజెక్ట్ చేసుకుంటూ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు బాలీవుడ్ జనం. ఆ క్రమంలోనే ‘బ్రహ్మాస్త్ర’ బాధ్యతను రాజమౌళిపై వుంచినట్లు తెలుస్తోంది.
సెప్టెంబర్ 9న ఈ సినిమా వరల్డ్ వైడ్గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో హైద్రాబాద్ రామోజీ ఫిలిం సిటీలో సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఏర్పాటు చేశారు. కానీ, హైద్రాబాద్లో గణేష్ నవరాత్రి వుత్సవాల హంగామా కారణంగా సెక్యూరిటీ ఇష్యూస్ వచ్చాయనీ, లాస్ట్ మినిట్లో ఈ ఈవెంట్ని పార్క్ హయత్ హోటల్కి మార్చారు.
అభిమానుల కోలాహలం మధ్య ఈవెంట్ని జరపలేకపోయినందుకు క్షమాపణలు చెప్పాడు ఈ ఈవెంట్కి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎన్జీయార్. కాగా, ఈ సినిమాలో బిగ్బి అమితాబ్ బచ్చన్, నాగార్జున కీలక పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే.
అంతా బాగానే వుంది. కానీ, ఎన్టీయార్, రాజమౌళి ‘బ్రహ్మాస్ర్ర’ని గట్టెక్కించగలరా.? ఈ మధ్య బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సొంత సినిమాలు దారుణంగా ఫెయిల్ అవుతున్నాయ్. మరి ఆ ఫెయిల్యూర్స్ నుంచి ‘బ్రహ్మాస్త్ర’ బాలీవుడ్ని ఆదుకుంటుందా.? లేదా.? ఇలాంటి అనుమానాలు సర్వత్రా నెలకొన్నాయ్. అయితే, ప్రమోషన్స్లో రాజమౌళికి ఓ స్పెషల్ స్ర్టాటజీ వుంటుంది. మరి, ‘బ్రహ్మాస్త్ర’ విషయంలో జక్కన్న స్ర్టాటజీ ఫలిస్తుందా.? చూడాలి మరి.
తాజా వార్తలు
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ మూసివేత..!!
- దుబాయ్ లో జనవరి 1న పార్కింగ్ ఫ్రీ..!!
- బహ్రెయిన్ లో అమల్లోకి కొత్త ఇంధన ధరలు..!!
- అల్-ముబారకియా నుండి చేపల మార్కెట్ తరలింపు..!!
- ఒమన్ లో 12 మంది ఆఫ్రికన్ జాతీయులు అరెస్..!!
- సౌదీ అరేబియాలో అనుమానాస్పద లింక్ల ధృవీకరణ సర్వీస్..!!
- తెలంగాణ: నాలుగు కమిషనరేట్లు ఏర్పాటు..
- తిరుమలలో సీఎం రేవంత్ రెడ్డికి టీటీడీ చైర్మన్ స్వాగతం
- ఏపీ క్యాబినెట్లో కీలక నిర్ణయాలు....
- ఇక పై మీ ఇమెయిల్ అడ్రస్ను మార్చుకోవచ్చు!







