ఆసియా కప్ 2022: టాస్ ఓడిన భారత్..

- September 04, 2022 , by Maagulf
ఆసియా కప్ 2022: టాస్ ఓడిన భారత్..

దుబాయ్: మరో బ్లాక్ బస్టర్ మ్యాచ్ కు వేదిక కానుంది.దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా భారత్, పాకిస్తాన్  జట్లు మరోసారి తలపడనున్నాయి. సూపర్ 4లో భాగంగా మరికొద్దిసేపట్లో ఆరంభమయ్యే ఈ పోరులో టాస్ నెగ్గిన పాకిస్తాన్ కెప్టెన్ బాబర్  ఆజం ఫీల్డింగ్ ఎంచకున్నాడు. ఈ మ్యాచ్ కోసం భారత్ మూడు మార్పులు చేసింది. అవేశ్ ఖాన్ పై వేటు వేయగా.. రవీంద్ర జడేజా గాయంతో తప్పుకున్నాడు. అదే సమయంలో దినేశ్ కార్తీక్ ను తప్పించింది. వీరి స్థానాల్లో హార్దిక్ పాండ్యా, రవి బిష్ణోయ్, దీపక్ హుడాలను తీసుకుంది. పాకిస్తాన్ కూాడా ఒక మార్పు చేసింది. గాయంతో దహాని తప్పుకోగా అతడి స్థానంలో హసన్ అలీ తుది జట్టులోకి వచ్చాడు.

టీమిండియా

రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, దీపక్ హుడా, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, చహల్, అర్ష్ దీప్ సింగ్

పాకిస్తాన్

బాబర్ ఆజమ్ (కెప్టెన్), మొహ్మద్ రిజ్వాన్, ఫఖర్ జమాన్, ఇఫ్తికర్ అహ్మద్, ఖుష్దిల్ షా, ఆసిఫ్ అలీ, షాదబ్ ఖాన్, మొహమ్మద్ నవాజ్, హసన్ అలీ, హరీస్ రావూఫ్, నసీం షా

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com