కొత్త చట్టం.. గరిష్టంగా SR20,000 జరిమానా..!!
- September 16, 2025
రియాద్: సౌదీ అరేబియాలో కొత్త రోడ్ ట్రాన్స్ పోర్ట్ చట్టం అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం.. లైసెన్స్ లేకుండా ప్రయాణీకులను తరలించడాన్ని నిషేధించారు. ఈ మేరకు ట్రాన్స్ పోర్ట్ జనరల్ అథారిటీ (TGA) ఒక ప్రకటన విడుదల చేసింది.
ఇకపై వాహన డ్రైవర్లు ప్రయాణీకులను పిలవడం, వారిని అనుసరించడం లేదా అడ్డగించడం, ప్రయాణీకుల ప్రాంతాలలో గుమిగూడడం వంటి అనధికార కార్యకలాపాలలో పాల్గొనడం నిషేధించినట్లు అథారిటీ తెలిపింది. చట్టాన్ని ఉల్లంఘించిన వారికి 11వేల సౌదీ రియాల్స్ వరకు జరిమానా విధిస్తారు. అదే లైసెన్స్ లేకుండా ట్రాన్స్ పోర్టు సేవలను అందిస్తే జరిమానా కింద 20వేల సౌదీ రియాల్స్ , 60 రోజుల వరకు సదరు వెహికిల్ ను సీజ్ చేస్తారని అథారిటీ హెచ్చరించింది. అలాగే, ప్రవాస డ్రైవర్లుంటే వారిని దేశం నుంచి బహిష్కరిస్తారని వెల్లడించింది.
తాజా వార్తలు
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!
- ఇంటర్నేషనల్ లేబర్ డే సందర్భంగా సుందరిగిరి శంకర్ గౌడ్కు ప్రత్యేక సేవా అవార్డు
- గ్లోబల్ విలేజ్లో కార్నివాల్ స్పెషల్ ఆఫర్: AED 99కే అన్లిమిటెడ్ రైడ్స్
- వాట్సాప్లోనే ఆరోగ్య సేవలు.. ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!
- బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!









