యూఏఈ లో ప్రపంచంలోనే అరుదైన పింక్ డైమండ్ ఎగ్జిబిషన్
- September 06, 2022
యూఏఈ: ప్రపంచంలోనే అత్యంత అరుదైన పింక్ డైమండ్స్ లో ఒకటైన “విలియమ్సన్ పింక్ స్టార్” వజ్రాన్ని దుబాయ్ లో ప్రదర్శనకు పెట్టారు. దుబాయ్ మల్టీ కమోడిటీస్ సెంటర్ (DMCC), ఫ్లాగ్షిప్ ఫ్రీ జోన్, కమోడిటీస్ ట్రేడ్ అండ్ ఎంటర్ప్రైజ్పై దుబాయ్ అథారిటీ ప్రభుత్వం సంయుక్తంగా ఈ ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేశాయి. అత్యంత ఆకర్షణీయంగా ఉండే పింక్ డైమండ్ ను చూసేందుకు పెద్ద ఎత్తున వ్యాపారులు ఈ షో కు వస్తున్నారు. ఈ పింక్ డైమండ్ 11.15 క్యారెట్లు ఉంటుంది. అక్టోబర్లో హాంగ్కాంగ్లోని సోత్బైస్ సింగిల్-లాట్ వేలంలో దీన్ని విక్రయించనున్నారు. ఆ లోపు సింగపూర్, తైపీలలో కూడిన పింక్ డైమండ్ ఎగ్జిబిషన్ ను నిర్వహించనున్నారు. అత్యంత అరుదైన ఈ వజ్రానికి వేలంలో దాదాపు 21 మిలియన్ డాలర్లు వస్తాయని అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ ఎమిరేట్స్ ఐడితో ఫ్రాడ్ రిస్క్..డేటా ప్రొటెక్షన్ గైడ్..!!
- ఇరాన్ దురాక్రమణ పై యూఎన్ఓలో బహ్రెయిన్ ఫైర్..!!
- ఉత్తర అల్ షర్కియాలో భారీగా పొగాకు ఉత్పత్తులు స్వాధీనం..!!
- సౌదీలో లేబర్ తనిఖీలు.. 80వేల సౌదీకరణ ఉల్లంఘనలు..!!
- కువైట్ లో నలుగురు ప్రవాసులకు, పీఏసీఐ అధికారికి జైలు శిక్ష..!!
- ఖతార్లో మూడవ దశలోకి హాట్ సీజన్..!!
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట







