ప్రవాస కార్మికులకు గుడ్ న్యూస్... వర్క్ పర్మిట్ రద్దు కు వేలిముద్రల సేకరణ
- September 06, 2022
కువైట్ సిటీ: కువైట్ లో ప్రవాసులకు వర్క్ పర్మిట్ విషయానికి సంబంధించి పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్ పవర్ (PAM) డిపార్ట్ మెంట్ కొత్త ప్రక్రియ షురూ చేసింది.ఇక నుంచి వర్కిట్ పర్మిట్ ఉన్న కార్మికులందరి వేలిముద్రలు తీసుకోనుంది. వర్కర్స్ తో పనిచేయించుకొని చాలా మంది యాజమాన్యాలు వారికి సరైన జీతాలు ఇవ్వటం లేదు, పైగా బకాయిలు పెడుతున్నాయి.ఈ సమస్య ను నివారించేందుకు ఇలా వేలిముద్రల ప్రక్రియ ప్రారంభించింది. ఇక నుంచి ఎవరి వర్క్ పర్మిట్ రద్దు చేయాలన్న వారికి కచ్చితంగా బకాయిలు చెల్లించాల్సి ఉంటుంది. అదే విధంగా పనికి కుదిరే ముందు అగ్రిమెంట్ లో ఉన్న అన్ని సౌకర్యాలను వర్కర్స్ కు కల్పించాల్సి ఉంటుంది.ఈ నిబంధనలను యాజమాన్యాలు ఉల్లంఘించకుండా పక్కాగా వర్కర్స్ వివరాలు, వారి వేలిముద్ర లు పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్ పవర్ డిపార్ట్ మెంట్ తీసుకుంటుంది.దీని కారణంగా వర్కిట్ పర్మిట్ పూర్తయ్యాక వర్కర్స్ కు ఎలాంటి బకాయిల బెడద ఉండదు.వేరే యాజమాన్యం పనికి చేర్చుకోవాలన్న సరే...అంతకుముందు పనిచేసిన చోట ఆ వర్కర్ కు పూర్తి జీతం చెల్లించిన వివరాలు ఉండాల్సిందే. ఇలా కొత్తగా ప్రవేశ పెట్టిన వేలిముద్రల ప్రక్రియ కువైట్ లో ప్రవాస కార్మికులకు మేలు చేయనుంది.
తాజా వార్తలు
- టపాసుల తయారీ కేంద్రంలో పేలుడు..ఎనిమిది మంది మృతి
- విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు యూఏఈ అధ్యక్షుడి శుభాకాంక్షలు
- యూఏఈలో సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్న ఇంధన ధరలు
- కువైట్లో భారీగా మద్యం స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్..!!
- ఒమన్లో వైద్య ఫీజుల మినహాయింపు జాబితాలో మార్పులు..!!
- సౌదీలో తప్పుడు సమాచారం ఇస్తే ఐదేళ్ల జైలు..SR2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్లో వాట్సాప్ మెసేజ్లు, వాయిస్ మెసేజ్లు అప్పు ఆధారాలుగా పనికొస్తాయా?
- బహ్రెయిన్లో విషాదం.. బాత్టబ్లో పడి మూడేళ్ల భారతీయ బాలుడి మృతి..!!
- యూఏఈలో 52 మంది బిలియనీర్లు.. వీరి మొత్తం సంపద ఎంతంటే?
- యూఏఈలో భారతీయులకు బయోమెట్రిక్ డేటా మోసాలపై హెచ్చరిక







