ప్రవాస కార్మికులకు గుడ్ న్యూస్... వర్క్ పర్మిట్ రద్దు కు వేలిముద్రల సేకరణ
- September 06, 2022
కువైట్ సిటీ: కువైట్ లో ప్రవాసులకు వర్క్ పర్మిట్ విషయానికి సంబంధించి పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్ పవర్ (PAM) డిపార్ట్ మెంట్ కొత్త ప్రక్రియ షురూ చేసింది.ఇక నుంచి వర్కిట్ పర్మిట్ ఉన్న కార్మికులందరి వేలిముద్రలు తీసుకోనుంది. వర్కర్స్ తో పనిచేయించుకొని చాలా మంది యాజమాన్యాలు వారికి సరైన జీతాలు ఇవ్వటం లేదు, పైగా బకాయిలు పెడుతున్నాయి.ఈ సమస్య ను నివారించేందుకు ఇలా వేలిముద్రల ప్రక్రియ ప్రారంభించింది. ఇక నుంచి ఎవరి వర్క్ పర్మిట్ రద్దు చేయాలన్న వారికి కచ్చితంగా బకాయిలు చెల్లించాల్సి ఉంటుంది. అదే విధంగా పనికి కుదిరే ముందు అగ్రిమెంట్ లో ఉన్న అన్ని సౌకర్యాలను వర్కర్స్ కు కల్పించాల్సి ఉంటుంది.ఈ నిబంధనలను యాజమాన్యాలు ఉల్లంఘించకుండా పక్కాగా వర్కర్స్ వివరాలు, వారి వేలిముద్ర లు పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్ పవర్ డిపార్ట్ మెంట్ తీసుకుంటుంది.దీని కారణంగా వర్కిట్ పర్మిట్ పూర్తయ్యాక వర్కర్స్ కు ఎలాంటి బకాయిల బెడద ఉండదు.వేరే యాజమాన్యం పనికి చేర్చుకోవాలన్న సరే...అంతకుముందు పనిచేసిన చోట ఆ వర్కర్ కు పూర్తి జీతం చెల్లించిన వివరాలు ఉండాల్సిందే. ఇలా కొత్తగా ప్రవేశ పెట్టిన వేలిముద్రల ప్రక్రియ కువైట్ లో ప్రవాస కార్మికులకు మేలు చేయనుంది.
తాజా వార్తలు
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!
- దోహాలో ఖతార్-భారత్ మధ్య ఇంధన చర్చలు..!!
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష









