ప్రవాస కార్మికులకు గుడ్ న్యూస్... వర్క్ పర్మిట్ రద్దు కు వేలిముద్రల సేకరణ
- September 06, 2022
కువైట్ సిటీ: కువైట్ లో ప్రవాసులకు వర్క్ పర్మిట్ విషయానికి సంబంధించి పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్ పవర్ (PAM) డిపార్ట్ మెంట్ కొత్త ప్రక్రియ షురూ చేసింది.ఇక నుంచి వర్కిట్ పర్మిట్ ఉన్న కార్మికులందరి వేలిముద్రలు తీసుకోనుంది. వర్కర్స్ తో పనిచేయించుకొని చాలా మంది యాజమాన్యాలు వారికి సరైన జీతాలు ఇవ్వటం లేదు, పైగా బకాయిలు పెడుతున్నాయి.ఈ సమస్య ను నివారించేందుకు ఇలా వేలిముద్రల ప్రక్రియ ప్రారంభించింది. ఇక నుంచి ఎవరి వర్క్ పర్మిట్ రద్దు చేయాలన్న వారికి కచ్చితంగా బకాయిలు చెల్లించాల్సి ఉంటుంది. అదే విధంగా పనికి కుదిరే ముందు అగ్రిమెంట్ లో ఉన్న అన్ని సౌకర్యాలను వర్కర్స్ కు కల్పించాల్సి ఉంటుంది.ఈ నిబంధనలను యాజమాన్యాలు ఉల్లంఘించకుండా పక్కాగా వర్కర్స్ వివరాలు, వారి వేలిముద్ర లు పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్ పవర్ డిపార్ట్ మెంట్ తీసుకుంటుంది.దీని కారణంగా వర్కిట్ పర్మిట్ పూర్తయ్యాక వర్కర్స్ కు ఎలాంటి బకాయిల బెడద ఉండదు.వేరే యాజమాన్యం పనికి చేర్చుకోవాలన్న సరే...అంతకుముందు పనిచేసిన చోట ఆ వర్కర్ కు పూర్తి జీతం చెల్లించిన వివరాలు ఉండాల్సిందే. ఇలా కొత్తగా ప్రవేశ పెట్టిన వేలిముద్రల ప్రక్రియ కువైట్ లో ప్రవాస కార్మికులకు మేలు చేయనుంది.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







