ప్రవాస కార్మికులకు గుడ్ న్యూస్... వర్క్ పర్మిట్ రద్దు కు వేలిముద్రల సేకరణ
- September 06, 2022
కువైట్ సిటీ: కువైట్ లో ప్రవాసులకు వర్క్ పర్మిట్ విషయానికి సంబంధించి పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్ పవర్ (PAM) డిపార్ట్ మెంట్ కొత్త ప్రక్రియ షురూ చేసింది.ఇక నుంచి వర్కిట్ పర్మిట్ ఉన్న కార్మికులందరి వేలిముద్రలు తీసుకోనుంది. వర్కర్స్ తో పనిచేయించుకొని చాలా మంది యాజమాన్యాలు వారికి సరైన జీతాలు ఇవ్వటం లేదు, పైగా బకాయిలు పెడుతున్నాయి.ఈ సమస్య ను నివారించేందుకు ఇలా వేలిముద్రల ప్రక్రియ ప్రారంభించింది. ఇక నుంచి ఎవరి వర్క్ పర్మిట్ రద్దు చేయాలన్న వారికి కచ్చితంగా బకాయిలు చెల్లించాల్సి ఉంటుంది. అదే విధంగా పనికి కుదిరే ముందు అగ్రిమెంట్ లో ఉన్న అన్ని సౌకర్యాలను వర్కర్స్ కు కల్పించాల్సి ఉంటుంది.ఈ నిబంధనలను యాజమాన్యాలు ఉల్లంఘించకుండా పక్కాగా వర్కర్స్ వివరాలు, వారి వేలిముద్ర లు పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్ పవర్ డిపార్ట్ మెంట్ తీసుకుంటుంది.దీని కారణంగా వర్కిట్ పర్మిట్ పూర్తయ్యాక వర్కర్స్ కు ఎలాంటి బకాయిల బెడద ఉండదు.వేరే యాజమాన్యం పనికి చేర్చుకోవాలన్న సరే...అంతకుముందు పనిచేసిన చోట ఆ వర్కర్ కు పూర్తి జీతం చెల్లించిన వివరాలు ఉండాల్సిందే. ఇలా కొత్తగా ప్రవేశ పెట్టిన వేలిముద్రల ప్రక్రియ కువైట్ లో ప్రవాస కార్మికులకు మేలు చేయనుంది.
తాజా వార్తలు
- యూఏఈ ఉద్యోగులకు అలర్ట్: సెలవుల్లో పని చేయమని బాస్ ఒత్తిడి చేస్తున్నారా?
- సెయింట్ లూయిస్లో NATS ఉచిత వైద్య శిబిరం, రక్తదానం
- తెలంగాణ: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ప్రపంచ దేశాలకు ట్రంప్ వార్నింగ్
- సమిష్టి కృషితోనే స్పోర్ట్స్ మీట్ విజయవంతం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇంటి వద్దకే రైలు పార్సిల్ సేవలు!
- శ్రీవారి పుష్కరిణిలో తెప్పోత్సవాల ట్రయల్ రన్
- రైల్వే అలర్ట్.. మార్చి 1 నుంచి ‘UTS’ యాప్ క్లోజ్
- ఏప్రిల్ 1 నుంచి క్రెడిట్ కార్డ్ కొత్త రూల్స్
- విద్యార్థులకు సోషల్ మీడియా నిషేధమా? ఏపీ కీలక నిర్ణయం









