'24' చిత్రం మే 6న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు...

- April 16, 2016 , by Maagulf
'24' చిత్రం మే 6న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు...

సూర్య, సమంత, నిత్యా మేనన్‌ కీలక పాత్రల్లో నటించిన '24' చిత్రం మే 6న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్ర బృందం సోషల్‌మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలిపింది. సూర్య త్రిపాత్రాభినయంలో నటించిన ఈ చిత్రాన్ని విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వం వహించారు. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై సూర్య చిత్రాన్ని నిర్మించారు. ఎ.ఆర్‌. రెహమాన్‌ సంగీతం అందించారు. ఈ చిత్రం సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ కథాంశంతో కూడుకుంది. ఇటీవల విడుదలైన '24' చిత్రం ట్రైలర్‌కు విశేష స్పందన లభిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com