కేసీఆర్ కు అస్వస్థత...
- April 17, 2016
తెలంగాణ సీఎం కేసీఆర్ అస్వస్థతకు గురయ్యారు. అత్యవసరంగా ఆయనకు వైద్యులు సేవలు అందించారు. వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయన స్వల్పంగా జర్వంతో బాధపడుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. ఆయన ప్రస్తుతం విశ్రాంతి అత్యవసరమని వైద్యలు చెప్పారట. ప్రస్తుతం ఆయన మెదక్ జిల్లాలోని తన ఫామ్ హౌజ్ లో విశ్రాంతి తీసుకుంటున్నారు.జ్వరం కారణంగా కేసీఆర్ అధికారి కార్యక్రమాలన్నీ తాత్కాలికంగా రద్దయ్యాయి. కనీసం మూడు రోజుల వరకూ సీఎం సాధారణ కార్యక్రమాలకు హాజరుకాలేకపోవచ్చని తెలుస్తోంది. ఫామ్ హౌజ్ నుంచి మూడు రోజులపాటు కేసీఆర్ బయటకు రాకపోవచ్చు. సీఎం అస్వస్థత వార్త విని టీఆర్ఎస్ శ్రేణులు కాస్త కంగారు పడినా.. స్వల్ప జర్వమేనని తెలుసుకుని ఊరట చెందాయి.ఓవైపు తెలంగాణలో ఎండలు మండిపోతున్న వేళ.. కేసీఆర్ అస్వస్థత వార్త అందరినీ కలవరపరిచింది. తెలంగాణ వ్యాప్తంగా గతంలో ఎన్నడూ లేనంతగా ఎండలు మండిపోతున్నాయి. శనివారం గరిష్టంగా నిజామాబాద్ లో గరిష్టం 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వాయువ్య భారత్ నుంచి ఉష్ణగాలులు వీస్తుండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం 5 వరకు బయటకు వెళ్లడం ప్రమాదకరణని వైద్యులు చెబుతున్నారు. రామగుండం, నల్గొండ, మహబూబ్నగర్లో 43 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. తెలంగాణ అంతటా 40 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శనివారం ఒక్కరోజే దాదాపు 17 మంది వరకూ వడగాల్పులతో మృత్యువాత పడ్డారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









