ఏపీ, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ రెండు రోజుల పర్యటన

- April 17, 2016 , by Maagulf
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ రెండు రోజుల పర్యటన

  ఏపీ, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం దిల్లీకి వెళ్తున్నారు. ఆయన ఆదివారం మధ్యాహ్నం బయల్దేరి దిల్లీకి చేరుకుంటారు. సోమవారం ఆయన రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌లను కలుస్తారు. విభజన చట్టంలో రెండు రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చిన హామీల అమలు, ఇరు రాష్ట్రాలకు ఉద్యోగుల బదలాయింపు, తొమ్మిదో, పదో షెడ్యూలు సంస్థల విభజన సహా ఇతర అంశాలను ఆయన కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిసింది. మంగళవారం మధ్యాహ్నం ఆయన దిల్లీ నుంచి హైదరాబాద్‌కు తిరిగొస్తారు. గవర్నర్‌ పర్యటన సాధారణమేనని, ఆయన మర్యాదపూర్వకంగా రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోం మంత్రిని కలుస్తారని రాజ్‌భవన్‌ వర్గాలు వెల్లడించాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com