ఏపీ, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ రెండు రోజుల పర్యటన
- April 17, 2016
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం దిల్లీకి వెళ్తున్నారు. ఆయన ఆదివారం మధ్యాహ్నం బయల్దేరి దిల్లీకి చేరుకుంటారు. సోమవారం ఆయన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్లను కలుస్తారు. విభజన చట్టంలో రెండు రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చిన హామీల అమలు, ఇరు రాష్ట్రాలకు ఉద్యోగుల బదలాయింపు, తొమ్మిదో, పదో షెడ్యూలు సంస్థల విభజన సహా ఇతర అంశాలను ఆయన కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిసింది. మంగళవారం మధ్యాహ్నం ఆయన దిల్లీ నుంచి హైదరాబాద్కు తిరిగొస్తారు. గవర్నర్ పర్యటన సాధారణమేనని, ఆయన మర్యాదపూర్వకంగా రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోం మంత్రిని కలుస్తారని రాజ్భవన్ వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







