అక్రమంగా కువైట్ లో ఉంటున్న వారి దేశాలకు పంపించే ప్రక్రియ వేగవంతం
- September 13, 2022
కువైట్: కువైట్ లో అక్రమంగా ఉంటున్న వారిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. వీసా, సరైన డాక్యుమెంట్లు లేకపోవటం, వీసా గడువు తీరినప్పటికీ దేశంలోనే ఉంటున్న ప్రవాసులను గుర్తించే పనిలో పడింది. ఈ విషయంలో కువైట్ ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ఇలాంటి వాళ్లందరినీ వెంటనే వారి దేశాలకు పంపించాలని నిర్ణయించింది. అక్రమంగా ఉంటున్న వారందరికీ గుర్తించే ప్రక్రియ వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించింది. దీంతో ప్రవాసుల వీసా, డాక్యుమెంట్లను అధికారులు తనిఖీలు చేస్తున్నారు. అక్రమంగా ఉంటున్న వారిపై భారీగా ఫైన్లు వేస్తూ వారిని స్వదేశానికి పంపించేందుకు అవసరమైన డాక్యుమెంట్లు సిద్ధం చేస్తున్నారు. ఇటీవల కాలంలో కువైట్ లో అక్రమంగా ఉంటున్న వారి సంఖ్య పెరిగిపోయింది. దీంతో ప్రక్షాళన చేపట్టింది కువైట్ ప్రభుత్వం. ఇప్పటికే అక్రమంగా ఉంటున్న వారందరూ స్వచ్ఛందంగా స్వదేశాలకు వెళ్లిపోయిందేకు కువైట్ ప్రభుత్వం గడువు ఇచ్చింది. అయినప్పటికీ చాలా మంది దేశం వీడి వెళ్లలేదు. దీంతో మరోసారి గడువు పెంచేది లేదని కువైట్ స్పష్టం చేసింది. అక్రమంగా ఉంటున్న వారిని దేశం నుంచి పంపించాల్సిందేనని గట్టిగా నిర్ణయించింది.
పిల్లల విషయంలో సందిగ్ధత
అక్రమంగా కువైట్ లో ఉంటున్న వారి పిల్లల విషయంలో సందిగ్ధత నెలకొంది. వారి పిల్లల పౌరసత్వం కోసం ఆయా దేశాల్లో వారు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. ఇటు కువైట్ లోనూ వారి చట్టబద్దత పై ఎలాంటి డాక్యుమెంట్లు లేవు. దీంతో వారంతా ఏ దేశ పౌరులన్నది తేలాల్సి ఉంది. చాలా మంది పిల్లల తల్లితండ్రులు ఎవరో కూడా గుర్తించటం కష్టంగా మారింది. దీంతో డీఎన్ఏ టెస్ట్ ల ద్వారా వారిని గుర్తించనున్నారు. ఈ పిల్లల పౌరసత్వం విషయంలో ఆయా దేశాలతో ఎంబసీలతో అధికారులు చర్చలు జరపనున్నారు.
తాజా వార్తలు
- IPL 2026: ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- హైడ్రా కమిషనర్ మాట మార్చిన కారణం ఏంటి: దాసోజు శ్రావణ్
- అంతర్జాతీయ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు...10 మంది అరెస్ట్
- హైదరాబాద్లో పలు చోట్ల వర్షం
- తెలంగాణలో పోటాపోటీగా రాజకీయ సభలు!
- ఉచితానికి పోతే ఖాతా ఖాళీ!
- ప్రజల మనసులు గెలవండి..మళ్లీ, మళ్లీ మనల్ని గెలిపిస్తారు: మంత్రి లోకేష్
- యువతికి పునర్జన్మ ప్రసాదించిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు
- తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారు!
- ప్రముఖ నిర్మాత RB చౌదరి కన్నుమూత









